పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

51

17. ముహమ్మద్‌ భక్త్‌ ఖాన్‌

(- 1859)

ప్రథమ స్వాతంత్య్రసంగ్రామానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన ఢిల్లీకి తరలివచ్చిన స్వదేశీ యోదులకు, ప్రజలకు నాయకత్వం వహించి, బ్రిటిష్‌ సైనిక బలగాలను ఏకోన్ముఖంగా ఎదుర్కొనగల సమర్ధుడి అవసరాన్నితీర్చిన మహాయోధులు ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ వీరుల సర్వసేనానిగా మహమ్మద్‌ భక్త్‌ఖాన్‌ చరిత్ర సృష్టించారు.

ఉత్తర ప్రదశ్‌ రాష్ట్రం అయోధ్య లోని సుల్తానపూర్‌లో మహమ్మద్‌ భక్త్ ఖాన్‌ జన్మించారు. తండ్రి పేరు అహమ్మదుల్లా ఖాన్‌. బ్రిటిష్‌ సైన్యంలో చేరి 40 సంవత్సరాల సుదీర్గ… అనుభవాన్ని సొంతం చేసుకున్నఆయన 1857లో రోహిల్‌ ఖండ్‌లో ఖాన్‌ బహుదూర్‌ ఖాన్‌ నేతృత్వంలో ఆంగ్లేయాధికారుల భరతం పట్టి స్వతంత్ర ప్రభుత్వ పతాకాన్ని రెపరెపలాడించారు. ఆ తరువాత బరెల్లీలోని ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఖజానానుస్వాధీనం చేసుకుని, సైనిక బలగాలను సమకూర్చుకున్న భక్త్‌ ఖాన్‌ మొగల్‌ పాదుషా బహదూర్‌ షా జఫర్ కు బాసటగా నిలవడనికి, తన బలగాలు, అపార ఖజానాతో ఢల్లీ చేరుకున్నారు. ఆయన ఢల్లీ చేరు కునేసరికి స్థానికంగా ఏర్పడిన అవాంఛనీయ పరిస్థితు ల మూలంగా సమర్థుడైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్న చక్రవర్తి జఫర్‌ ఆయనను స్వదేశీ సేనలకు సర్వసేనానిగా నియమించారు. ఢిల్లీ నగర సంరక్షణ బాధ్యతలను ఆయనకు

చిరస్మ రణీయులు