పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

49

16. పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌

(- 1859)

ఆధు8నిక ఆయుధాలు కలిగి, అపారమైన సైనిక బలగాలున్న బ్రిటిష్‌ పాలకులను ఎదుర్కోవటం మృత్యువును వాటేసుకోవడమేనని స్వదేశీ యోధులకు స్పష్టంగా తెలిసినా, తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి పరాయి పాలకులను తరిమికొట్టేందుకు నడుంకట్టీన యోధులలో పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ (Pathan Turrebaz Khan) ఒకరు.

పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదారాబాద్‌ నివాసి పఠాన్‌ రుస్తుం ఖాన్‌ కుమారుడు.బ్రిటిష్‌ సైన్యంలో సైన్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన పరాక్రమాలకు పెట్టింటిెంది పేరైన రొహిల్లా సైనిక పటాలానికి చెందిన నాయకుడు.

ఉత్తర హిందూస్థానంలో ఆరంభమైన తిరుగుబాటు పవనాలు తిన్నగా దక్షిణ హిందూస్థానాన్ని కూడాతాకాయి. ఆంగ్లేయులకు హితుడుగా మారిన నైజాం నవాబు వారి అభిష్టం మేరకు నడుచుకుంటున్నా, బ్రిటిష్‌ పాలకుల నుండి మాతృగడ్డను విముక్తి చేయ మని యవతీ యువకులను, భారతీయ సైనికులను, స్వదేశీ పాలకులను ధార్మికపెద్దలను ప్రోత్సహిస్తున్నవాతావరణం. ఆ వాతావరణంలో బానిసత్వం నుండి విముక్తికై పోరాడమని హైదారాబాద్‌కు చెందిన మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌కు ఉద్బోధించారు.ఆ ప్రేరణతో ఆంగ్లేయుల మీద పోరాటానికి నడుం కట్టిన తుర్రేబాజ్‌ ఖాన్‌ మౌల్వీ

చిరస్మ రణీయులు