పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

ఝాన్సీ విజయం గురించి అప్పటి సెంట్రల్‌ ఇండియా ప్రాంతానికి గవర్నర్‌ జనరల్‌ ప్రతినిధి అయినటువంటి రాబర్ట్‌ హెమిల్టన్‌ 1858 అక్టోబర్‌ 30న అప్పటి భారత ప్రభుత్వ కార్యదర్శి ఎడ్‌సన్‌కు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో రాణి లక్ష్మీబాయి ఏ విధంగా పోరాడింది, ఏవిధంగా కన్నుమూసింది వివరంగా తెలిపాడు. ఆ కథనం ప్రకారంగా, రాణి వెన్నంటి ఒక ముస్లిం యువతి గుర్రం మీద అనుసరించేది. కొఠాకి సరాయి ప్రాంతంలో రాణి తోపాటుగా ఆమెకు తుపాకి గుండ్లు తగిలాయి. ఆమె రాణితోపాటుగా ఒకేసారి నేలకొరిగిందని అతడు వివరించాడు.

ఈ విషయాన్ని Dr. Surendra Nath Sen తన EIGHTEEN FIFTY SEVEN గ్రంథంలో రాబర్ట్‌ హెమిల్టన్‌ వివరణను, '.. The Rane was on Horse back, and close to her was the female (a Mohomaden) who seems never to have left her side on any occasion, these two were struck by bullets and fell ' (Page 295) అని ఉటంకించారు.ఈ లేఖలో ఎక్కడ కూడా ఆయువతి ఎవరన్న విషయంగాని, ఆమె పేరు ఏంటన్నది మాత్రం పూర్తిగా ప్రస్తావించలేదు.

ఆ కారణంగా ముందార్‌ అజ్ఞాత యోధురాలుగా మిగిలిపోయింది. ఝాన్సీ గురించి ప్రస్తావించినప్పుడల్లా ముస్లిం యువతి అని మాత్రమే పేర్కొనడంతో ఆమె వివరాలు గుప్తంగా ఉండిపోయాయి. కాగా ఈ విషయాన్ని డాకర్‌ పి.యన్‌.ఛోప్రా కొంత స్పష్టపర్చారు. భారత ప్రభుత్వం 1973లో ప్రచురించిన Who's who of Indian Martyrs, Vol. 3, Page.102 లో మాత్రం ఝాన్సీ రాణితో పాటుగా పలు పోరాటాలలో పాల్గ్గొన్న ఆ ముస్లిం మహిళ గురించి ప్రస్తావిస్తూ డాక్టర్‌ ఛోప్రా ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.

'..Fought by the side of Maharani Lakshmi Bai during the battles against the British at Jhansi, Koonch, Kapi and Gwalior, Killed in the battle at Kotah-kisarai in Gwalior, where the Rani attained martyrdom. Her Body was also cremated in the garden of Baba Ganga Das at Gwalior on June 17, 1857 '.

ఈ వివరణలను, చరిత్ర గ్రంథాలలో వ్యకమవుతున్న కదనాలకు అంవయించుకుని చూస్తే ఆ అజ్ఞాత యోధురాలు పేరు 'ముందర్' గా భావించవచ్చు. ఝాన్సీ రాణి లకీక్ష్మీబాయి అంగరక్షకు రాలుగా వ్యవహరించిన ముందర్‌ ఆమె వెంట చివరికంటా సాగి ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడుతూ రాణితోపాటుగా 1858 న్‌ 16న నేలకొరిగారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌