పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39

11. మౌలానా ముహమ్మద్‌ బాఖర్‌

(1780-1857)

ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో అగ్నికణాల్లా ఎగిసిపడుతున్నవీరులను ఉత్సాహపర్చడంలో పత్రికలు, పాత్రికేయులు బహుముఖ పాత్రవహించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల చర్య ల మీద అక్షరాగ్నులు కురిపిసూ,్త తిరుగుబాటు వీరులను ప్రోత్సహించిన ఆనాటి పాత్రికేయులలో మౌలానా ముహమ్మద్‌ బాఖర్‌ అగ్రగామి.

1780లో ముహమ్మద్‌ బాఖర్‌ ఢిల్లీలో జన్మించారు. తండ్రి మొహమ్మద్‌ అక్బర్‌. చిన్ననాటనే ధార్మిక-ప్రాపంచిక విషయాల పట్ల అత్యంత ఆసక్తి చూపిన బాఖర్‌లో స్వతంత్ర భావనలు చిగురించాయి. ప్రసిద్ధ ఢిల్లీ కాలేజీ విద్యార్థిగా ఉన్నత విద్యను పూర్తి చేసిన బాఖర్‌ కొంతకాలం ఉన్నత ఉద్యోగాలు చేసినా చిన్నతనంలోనే హృదయంలో నాటుకున్న సేfiఛ్చా, స్వాతంత్య్ర బీజాలు, స్వజనులు అనుభవిస్తున్న బానిసత్వం, ఆయనను ఆ ఉద్యోగాలలో నిలువరించలేకపోయాయి.

స్వతంత్ర జీవనం మాత్రమే కాకుండా, ప్రజలకు మార్గదర్శకం వహించగల వృత్తిని చేపట్టాలన్న దాక్పధంతో మౌలానా బాఖర్‌ జర్నలిజం వైపు మొగ్గు చూపారు. బ్రిటిషు పాలకుల దుష్ట సంకల్పాన్ని, అధికారుల దాష్టీికాలనూ ఎండగడ్తూ, ప్రజలకు వాస్తవాలు తెలిపి చెతన్యవంతుల్ని చేయాలన్నలక్ష్యంతో 1836లో ఢల్లీ ఉర్దూ అఖ్బార్‌ వారపత్రికను


చిరస్మ రణయులు