పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. మజ్నూషా ఫకీర్

( -1787)

ఇండియాలో అడుగిడిన బ్రిటిషర్లు మెల్లగా ప్రజల మీద పెత్తనం, దోపిడికి పాల్పడటం ప్రారంభించేసరికి రగిలిన ఆగ్రహావేశాల నేపద్యంలో 1765లో విజృంభించిన ఫకీర్లు తిరుగుబాటుకు నాయకత్వం వహించిన యోధులు మజ్నూషా ఫకీర్‌.

బెంగాల్‌ పరగణాలోని కాన్పూరు సమీపాన గల మాఖన్‌పూర్‌ గ్రామానికి చెందిన మజ్నూషాను ప్రజలు మంజూ షా అని కూడ పిలుచుకున్నారు. ధార్మిక వ్యవస్థాపరంగా చూస్తే ఈయన మదారి సాంప్రదాయానికి చెందిన ఫకీర్‌. మదారి తెగలో గురు-శిష్య సంబంధాలు చాలా పటిష్టంగా ఉంటాయి.

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, అధికారులు, వడ్డీవ్యాపారులు, జమిందారులు చేస్తున్న దోపిడి, దాష్టికాలను గమనించిన గురువు దార్వేష్‌ హమీద్‌ ఆదేశాల మేరకు మజ్నూషా పలు ప్రాంతాలను సందర్శించారు. ఆ సందర్భంగా ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్న ఆయన తన లక్ష్యాయలను ప్రజల ముందుంచగా ఆంగ్లేయుల రాక్షసచర్యలను సహించలేక ప్రజలు, క్షామపీడితులు మజ్నూషా వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు.

ఆనాడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ దోపిడీ, పెత్తనాలకు వ్యతిరేకంగా తిరగబడిన ఫకీర్లకు నాగా సన్యాసుల స్నేహహస్తం లభించటంతో ఈ తిరుగుబాట్లను ఫకీర్లు -సన్యాసుల

చిరస్మ రణీయులు