పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

శివప్రసాద్‌ వీధి, కొత్తపేట వినుకొండ - 522 647.

రచయిత మాట

బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలలో పాల్గొని తమదైన సాహసోపేత, త్యాగాలతో పునీతులైన ముస్లిం యోధుల గురించి సంక్షిప్త సమాచారంతో పుస్తకం రాయమని చాలా కాలంగా మిత్రులు, విజయవాడకు చెందిన సామాజిక కార్యకర్త హబీబుర్‌ రెహమాన్‌ కోరుతూ వచ్చినందున చిరస్మరణీయులు రాశాను. ఒక్కసారిగా వందమంది స్వాతంత్య్ర సమర యోధుల జీవిత చరిత్రలను ఒక గ్రంథంలోనే చదవగల అవకాశం పాఠకులకు కల్పిస్తే బాగుంటుందన్న మిత్రుని సలహా ఈ పుస్తకాన్ని రూపొందించేందుకు మరింతగా నన్ను పురికొల్పింది.

ఆంగ్లేయుల పాలనను తుదముట్టించేందుకు 1757 నుండి 1947 వరకు సాగిన పోరాటాలలో పాల్గొన్నవంద మంది యోధు ల గురించి సంక్షిపంగా చిరస్మ రణీయులు లో వివరించాను. ఈ పోరాటాలలో పాల్గొన్న సామాన్య సైనికుడి నుండి సంస్థానాధీశుని వరకు, సామాన్య ప్రజల నుండి ప్రముఖుల వరకు ప్రాతినిధ్ం కల్పిస్తూ తగిన ప్రాధమిక సమాచారంతోపాటుగా విశేషాంశాలను కూడా జోడించ ప్రయత్నించాను.

ప్రదమస్వాతంత్ర సంగ్రామానికి ముందు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమించిన ప్రజా పోరాటాల నేతలు, ఆ తరువాత ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల పెత్తనాన్ని తిరస్క రిస్తూ పోరుబాట పట్టిన నవాబులు, సంస్థానాధీశుల వివరాలను, ప్రథమస్వాతంత్య్ర సంగ్రామం, జాతీయోద్యమంలో భాగంగా సాగిన శాంతియుత- సాయుధ పోరాటాలలో భాగస్వాములైన సమర యోధులు, చివరకు ఇండియ న్‌ యూనియన్‌ లో నైజాం సంస్థానం విలీనం కోరుతూ సాగిన ఉద్యమంలో భాగస్వాములైన యోధుల వివరాలు కూడా సమకూర్చాను.

మాతృభూమిని వలసపాలకుల నుండి విముక్తం చేసేందుకు ఉద్యమించిన