పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

విదేశీవస్తు బహిష్కరణకు, మధ్యపాన విక్రయశాలల వద్ద పికిటింగ్ కార్యక్రమాలకు ప్రేరణగా నిలిచారు.ఆమెను అడ్డుకోవాలన్న ప్రభుత్వంశాంతి భద్రతలకు భంగం కల్గించారన్న నేరారోపణ చేసి ఆమెను అరెస్టు చేసింది.

ఆ తరువాత ఏకపక్ష విచారణ జరిపి ఆమెకు నాలుగు మాసాల కఠిన కారాగార శిక్ష, వందరూపాయల జరిమానా విధించింది. ఈ వార్త గుజరాత్‌ రాష్ట్రంలో సంచలనం సృషించింది. ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తంచేశారు. బ్రిటిష్‌ న్యాయవ్యవస్థను, ప్రబు త్వాన్ని దుయ్యపడ్తూ, సకీనా బేగంకు విధించిన శిక్షను రద్దు చేయాల్సిందిగా ఉద్యమించారు. జాతీయోద్యమ నాయకులంతా ఆమె శిక్షను రద్దు చేయాల్సిందిగా ముక్త కంఠంతో డిమాండ్‌ చేశారు. అందుకు స్పందించిన ప్రబుత్వం సకీనా లుక్మాని స్వయంగా శిక్షరద్దును అభ్యర్థిస్తే శిక్ష తగ్గించగల అవకాశాలను పరిశీలిస్తామని ప్రకటించింది. ఆమె మాత్రం ప్రభుత్వం కోరినట్టుగా శిక్ష రద్దు చేయమంటూ విజ్ఞప్తి చేసేందుదాుకు నిరాకరించారు.

ఆ సందర్బంగా అమ్మను నిరోధిస్తే ఆమె ఆరంభించిన కార్యక్రమాలను కొనసాగించ డానికి మేమున్నాం. మమ్మల్ని కూడా అరెస్టు చేయండి. మాకూ శిక్షలు విధించండి, అంటూ గుజరాత్‌ యువత భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చింది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు ప్రబుత్వ చర్యల మీద నిరసన వ్యకంచేస్తూ విరుచుకుపడ్డారు. ప్రజల నిరసన దృష్ట్యా ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రభుత్వానికి సకీనా లుక్మానికి విధించిన కఠిన జైలు శిక్షను సామాన్య జైలుశిక్షగా మార్చక తప్పలేదు.

ఈ మేరకు 'తయ్యాబ్జీ పరివారం సభ్యులు అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించారు' అంటూ గాంధీజీ నుండి ప్రశంసలందుకున్నసకీనా బేగం, జాతీయోద్యమ కార్యకలాపాలు అన్నింటిలో ప్రముఖ పాత్ర వహించారు. మధ్యపాన నిషేధ ఉద్యమంలో భాగంగా గుజరాత్‌ రాష్ట్ర మహిళలు వైశ్రాయ్‌కు రాసిన చారిత్రాత్మక లేఖ మీద అమీనా తయ్యాబ్జీతో పాటుగా సకీనా లుక్మాని పాల్గొని గాంధీజీ విజ్ఞప్తి మేరకు ప్రకటన మీద సంతకం చేశారు. గాంధీజీని బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టుచేయగా గుజరాత్‌లో మహిళలతో భారీ సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రభుత్వ వైఖరిని ఆమె తీవ్రంగా విమర్శించారు.

అపూర్వత్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధ్దించాక, దేశం రెండుగా చీలిపోవటం పట్ల ఆమె ఎంతో వ్యాకులత చెందిన ఆమె ఆ తరువాత రాజకీయాలకు దూరమయ్యారు. తన సమయాన్నిపూర్తిగా సామాజిక సేవకు అంకితం చేసిన బేగం సకీనా లుక్మాని 1960 ఫిబ్రవరి 6న కన్నుమూసేంత వరకూ జాతిజన సేవలో గడపారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌