Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బయ్యె నాచేతఁ గ్రోధంబును గామంబును గవిత్వంబును బ్రదర్శితంబయ్యె వాలిని
వంచించి చంపించినకారణంబున విశ్వరూపవధంబువలన నింద్రునకుం బోలె
నాకును భావచింతకులచేత నైన నచింతనీయంబును బాపకృత్యులచే నైనం బరి
వర్జనీయంబును బాపాభిరుచిచేత నైన ననీప్సనీయంబును బాపదర్శులచే నైన
ననవేక్షణీయంబు నగుమహాపాతకంబు సంప్రాప్తం బయ్యె నింద్రునిపాపంబు
భూమియు జలంబును వృక్షంబులును యువతులును బంచికొని కుడిచిరి శాఖా
మృగంబునైన నాపాపం బెవ్వరు పంచి కుడుచువారు కులనాశయుక్తంబు నధ
ర్మయుక్తంబు నగునిట్టిదుష్కృతకర్మం బాచరించియున్న యేను బ్రజాసమ్మానం
బునకును యౌవరాజ్యంబునకును యోగ్యుండఁ గాను మహారాజ్యంబున కెట్లు
యోగ్యుండ నగుదు లోకావమతం బైనగర్హితక్షుద్రపాపంబునకుఁ బ్రవర్త
కుండ నైతి వృష్టిసలిలవేగంబు నిమ్నంబునుంబలె నీదురంతశోకంబు న న్ననుస
రించుచున్న దని పలికి వెండియు నిట్లనియె.

603


క.

క్షుమ భ్రాతృవధాపరకా, యము సంతాపోర్ధ్వకాయ మగు పాపమయే
భము పీడించుచు నున్నది, క్రమమున న న్గదిసి యేటిగట్టునుబోలెన్.

604


వ.

రాజేంద్రా నాహృదయంబునం గలవివేకధైర్యరూపం బైనయీసాధువృత్తంబు
తనతోఁ గూడ వర్తించుచున్న భ్రాతృవధజనితపాపంబును సహింపక వివర్ణం
బైనజాతరూపంబు వహ్నియందుఁ బరితప్యమానం బగుచుఁ దనతోఁ గూడి
యున్న ఋజీషాంశమలంబును సహింపక తాను వేఱైనచందంబునఁ బృథగ్విధం
బగుచున్నది.

605


సీ.

నరనాథ నాదుదుర్నయ మీకుమారుని శోకతాపముఁ జూచి శోక మడర
నురుబలవానరయూథపయూథంబు పరఁగ నర్థస్థితప్రాణముక్రియ
నయ్యెడు నని హృదయంబునఁ దలఁచెద సుతుఁడు సులభ్యుండు నువ్రతుండు
సుమతి సువశ్యుండు సుజనుఁ డంగదునకు సరియైనతనయుండు జగతిఁ గలఁడె


తే.

యనఘచారిత్ర యేదేశమందు భ్రాతృ, సన్నిధానంబు మిక్కిలి సంఘటిల్లు
నట్టిదేశంబు లే దింతయఘముఁ జేసి, శిష్టజనపార్శ్వ మేమని చేరువాఁడ.

606


క.

హితకరుఁ డీతారేయుఁడు, బ్రతికిన నత్తార వీనిఁ బాలించుటకున్
బ్రతుకు నటుగాక తక్కిన, బ్రతుకునె యొకనిమిష మైన భానుకులేశా.

607


మ.

భువనస్తుత్య భవన్నిదేశగతు లై పొల్పొంద నీవర్తమా
నవనాటోత్తము లంద ఱాజనకభూనాథాత్మజన్ సద్గుణ
స్తవనీయం దిలకించి వచ్చెదరు తథ్యం బేను దారేయ వా
సవిసఖ్యం బెదఁ గోరి మేను దహనజ్వాలాలి కర్పించెదన్.

608


వ.

దేవా యేను మృతుండ నగుచుండ సర్వకార్యంబులు సమర్థించుకొనుటకు
మీరె చాలుదు రజీవనార్హుండను గృతాపరాధుండను గులహంతృకుండ నైన
నా కనుజ్ఞ యొసంగుఁడు.

609