| |
న్నయోధ్యాపురంబున రాజసచివులు పురోహితుం బురస్కరించుకొని యభిషేకో
పయోగిమంగళద్రవ్యసంపాదనార్థం బెద్ది కర్జం బని యాలోచించిరి యశోక
విజయసుమంత్రాదులు రామవృద్ధికొఱకు నగరవృద్ధికొఱకుఁ గూడుకొని యా
లోచనంబు గావించి జయార్హుం డైనరామునియభిషేకార్థం బెయ్యది కర్తవ్యంబు
దాని నంతయు మంగళపూర్వకంబుగాఁ గావింప నర్హు లని పురోహితునకుం
జెప్పి రామదర్శనలాలసులై పురంబు నిర్గమించి రామునికడకుం జనుదెంచి రిట్లు
గూడుకొనిన యశోకాదిమంత్రులం గూడి రామచంద్రుండు నక్షత్రసహితుం
డైనచంద్రుండుఁబోలె వెలుంగుచు ననంతవైభవాభిరంజితుం డై దివ్యరథం
బారోహించి సాకేతపురంబునకుం జనుసమయంబున.
| 3255
|
రాముఁడు సపరివారుఁడై యయోధ్యానగరంబు ప్రవేశించుట
| సీ. |
కమనీయగుణగణాకరుఁ డైనభరతుండు గడువేడ్క హరులపగ్గములు పట్టె
శత్రుఘ్నుఁ డప్పుడు శతశలాకం బైన తతపాండురాతపత్రము ధరించె
లక్ష్మివర్ధనుఁ డైనలక్ష్మణుం డభినవవ్యజనంబుఁ దాల్చి సొంపలర విసరె
విధునిభం బగునొండువింజామరము గొని యలవిభీషణుఁడు చెన్నార వీచె
|
|
| తే. |
నంజనాచలతుల్యశత్రుంజయాఖ్య, దంతి నెక్కి సుగ్రీవుఁ డాచెంత నరిగె
నవసహస్రనాగము లెక్కి నయ మెలర్ప, మనుజరూపంబు గైకొని చనిరి కపులు.
| 3256
|
| చ. |
ఘనతర శంఖనాదములు కాహళవేణుమృదంగవల్లకీ
స్వనములు డిండిమధ్వనులు చారుతరాంక్యవిశాలభేరికా
నినదములు న్మహాపటహనిస్వనము ల్కరతాళశబ్దముల్
మునుకొని గాఢభంగి మినుముట్టి సమున్నతి మ్రోసె నత్తఱిన్.
| 3257
|
| మ. |
అనుమానింపక యీరఘూత్తముఁడు దేవారి న్దశాస్యు న్రణం
బున మర్దించి జగత్త్రయంబునకు సమ్మోదంబు గావించె నీ
యనఘుం డెంతమహాత్ముఁ డెంతఘనుఁ డాహా యంచుఁ గీర్తించుదే
వనికాయంబులస్తోత్రము ల్మధురవాగ్వైచిత్రి మ్రోసె న్టివిన్.
| 3258
|
| ఉ. |
కాదన కీరఘూత్తముఁడు కానకుఁ బోయిననాఁటిఖేదమే
ఖేద మితండు వెండి పురికిం జనుదెంచెడు నేఁటి మోదమే
మోద మటంచు జానపదముఖ్యులు పౌరులు గూడి గాఢస
మ్మోదరసాబ్ధిఁ దేలుచు సమున్నతి రామునిఁ జూచి రయ్యెడన్.
| 3259
|
| మ. |
మఱియు న్మంత్రిపురోహితుల్ హితులు సామంతుల్ బుధుల్ సేవకుల్
గరిమ న్దివ్యరథస్తుఁ డై పురికి వేడ్క న్వచ్చురామాధిపుం
గరుణోదారునిఁ బూర్వశైలశిఖరాగ్రస్థోడురాజుంబలెన్
దెఱఁగొప్పం గనుఱెప్ప వేయక దమి న్వీక్షించి ర ట్లందఱున్.
| 3260
|
| వ. |
మఱియు సర్వాలంకారభూషిత లగుకన్యలును ధేనువులును జాతరూపాక్షత
|
|