Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/833

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దుష్కృతంబున నింత దురవస్థ దొరకొనె స్వకృతకర్మఫలంబు వ్యర్థమగునె
తనపూర్వకర్మంబు దక్క సుఖంబు దుఃఖము సేయ వేఱొక్కకర్త గలఁడె


తే.

రావణునియాజ్ఞ నీదైత్యరమణు లెల్ల, నన్నుఁ దర్జించి రిందాఁక నయము విడిచి
యతఁడు దెగియె నింకేమి సేయంగఁ గలరు, వీరిఁ జంపిన మన కేమి పేరు గలదు.

2920


వ.

వానరోత్తమా ము న్నొక్కమహారణ్యంబులోన నొక్కవ్యాధుం డొక్కశా
ర్దూలంబుచేత ధర్షింపంబడి సాధ్వసంబున నొక్కవృక్షం బెక్కిన నావృక్షంబు
మీఁద నంతకుము న్నొక్కభల్లూకం బెక్కి యుండి తన్ను విలోకించి మిక్కిలి
భయంబున వడంకుచున్నవ్యాధున కభయంబు దెల్పి తనయొద్దకుం దిగిచికొని
నీవు నిర్భయంబున నిద్రింపు మేను మేల్కొని యుండెద నని పలికినఁ దద్వచన
ప్రకారంబున వ్యాధుండు నిద్రించుచుండ నప్పు డావృక్షంబుక్రిందనే యుండి
వ్యాఘ్రంబు భల్లూకంబుతో నీవ్యాధుండు మన కంతకుండు దైవయోగంబున
నిప్పుడు చిక్కె వీనితోడి దేమి పని వీని దిగం ద్రోయు మేను వీని భక్షించి యథే
చ్ఛం జనియెద దీనం జేసి నీకును నాకును సఖ్యంబు గలుగు నని పలికిన నాభల్లూ
కంబు శరణాగతుం డైనవీనిం బరిత్యజించిన ధర్మహాని యగు నీచెప్పినట్లు సేయ
నోప నని పలికి వ్యాధుం బ్రబోధితుం జేసి యే నింక నొక్కింతసేపు
నిద్రించెద నీవు మేల్కని యుండు మని పలికి భల్లూకంబు నిద్రించిన
నావ్యాఘ్రంబు వ్యాధునితో నీభల్లూకంబు భక్ష్యలుబ్ధం బై నీతోడ మాయావా
దంబుఁ జేసె దీనిం బడఁద్రోచితివేని యేను భక్షించి చనియెద నంత నీవు నిర్భ
యంబున వృక్షంబు డిగ్గి యథేచ్చం జనియెద వట్లు గావింపుమని పలికిన వ్యాఘ్ర
చోదితుండై వృక్షంబుమీఁదనుండి ఋక్షంబు క్రిందం బడఁద్రోచిన నది యభ్యా
సబలంబున శాఖాంతరం బవలంబించి దిగువం బడక కృతాపరాధుం డైనవీనిం
బడఁద్రోయు మని వెండియు వ్యాఘ్రంబుచేత నుచ్యమానంబయ్యును భల్లూ
కంబు కృతాపరాధుం డైనను వీని నీ కొసంగ నని పలికి వ్యాధుని రక్షించె నని
పురాణకథ గలదు పరుల నుద్దేశించి పాపం బాచరించువారికిఁ బ్రాజ్ఞులగువారు
ప్రత్యుపకారరూపం బైనపాపం బంగీకరింప రపకారులయందైనఁ బ్రత్యప
కారవర్ణనరూపం బైనయాచారంబు రక్షితవ్యంబై యుండుఁ బెద్ద లగువారు
చారిత్రభూషణులై యుందురు వధార్హు లగునట్టివారియందును సజ్జనునిచేతఁ
గారుణ్యంబు కర్తవ్యంబై యుండు లోకంబునం దపరాధంబు గావింపనివాఁ
డొకఁడైన లేఁడు దయాశాలి యగు వానికి సర్వజనరక్షణంబు యోగ్యంబు
లోకంబునందుఁ బరహింసనంబును గామసంచారంబును బాపాచరణంబును
రాక్షసులకు స్వాభావికం బైనధర్మం బట్టివారియందు దండనంబు సముచి
తంబు గా దని పలికిన నవ్వాయునందనుం డవ్వైదేహి కిట్లనియె.

2921


తే.

పరమకళ్యాణి నీవు భూపాలమణికిఁ, బతికి రామున కనురూపపత్ని వైతి
వేమనఁగ వచ్చు నీగుణం బేను విభుని, కడకుఁ జనెద సందేశంబు నొడువు మింక.

2922