Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/788

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్వరయక్షేశయమాదిదిక్పతులదోఃప్రాబల్యమున్ మాన్చి బం
ధురలీలం జెలువారె నీదుభుజముల్ దుర్వారశౌర్యోద్ధతిన్.

2576


మ.

అసమానోరుభవత్కరార్పితసముద్యద్దేవతానోకహ
ప్రసవాలంకృత మైననాదుకబరీభారంబు నివ్వానరుం
డసురుల్ చూడఁగఁ బట్టి యీడ్చె దనుజేంద్రా భూరిబాహాబలం
బెసఁగన్ వీనిమదంబు వో నిడక నీ కిట్లుండఁగాఁ జెల్లునే.

2577


చ.

అజునిఁ దపంబునం దనిపి యవ్విభుచేత వరంబు లంది దో
ర్విజితజగత్త్రయుండ వయి వీరుఁ డనంగఁ బ్రసిద్ధి గన్ననీ
నిజసతికేశపాశ మొకనీచవనాటుఁడు పట్టి యీడ్చె నో
రజనిచరేంద్ర మానముఁ దిరం బగుకీర్తియు నింక నిల్చునే.

2578


క.

మునివృత్తి హోమకృత్యం, బొనరించి నృపాలమౌళి నుద్ధతి ననిలో
మునుకొని జయింపఁ జూచితొ, పనిగొన వింకఁ గొఱగానిపనులు సురారీ.

2579


తే.

మంత్రములు తంత్రములు దైత్యమాయ లన్ని
శక్రజితునితోడనె వెంటఁ జనియె నింక
నేమి చేసిన నే మగు నృపవరేణ్యు
శరనిహతిఁ గూలు టంతియె గొఱఁత నీకు.

2580


చ.

రణమున కీవు పోయి రఘురామునిముంగలఁ గొంతసేపు మా
ర్గణములకల్మిఁ జూపి తుది రాజలలామునివిస్ఫురద్ధను
ర్గుణపరిముక్తకాండములఁ గూలుము భూస్థలి నట్లు గానిచో
గుణ మది గల్గి రామునకు గొబ్బున జానకి ని మ్మధీశ్వరా.

2581


వ.

అని యిట్లు మందోదరి శోకరోషభయలజ్జాపరాభవకలిత యై పలికిన విని రాక్షస
వల్లభుం డగురావణుండు హోమంబు చాలించి మౌనంబు విడిచి డిగ్గన లేచి రోషా
నలజ్వాలాభీలలోచనుండై కాలవ్యాళంబుం బోనికరవాలం బంకించి వాలినంద
నునిభుజాంతరంబు వ్రేసి మూర్ఛితుం జేసి తనప్రాణేశ్వరిని విడిపించిన నది వాతాం
దోళితవనలతకైవడి నడలుచుఁ గేశబంధంబు వీడి వెన్నున జీరియాడఁ బాదం
బులు తొట్రువడ రోదనంబు సేయుచు నంతఃపురంబునకుం జనియె నప్పుడు విసం
జ్ఞుం డైనయంగదుం జూచి బలవంతుం డగుహనుమంతుండు మహాశనిసంకాశం
బైనముష్టి నలవరించి దశగ్రీవునిమస్తకంబుఁ బొడిచె నంతలోనం దెలివొంది
పురందరపౌత్త్రుండు రక్తధారాస్నపితదేహుం డై ధాతుభూషితం బైనశైలంబు
చాడ్పునం జూపట్టుచు నతికోపంబున దైత్యేంద్రునిబలంబు దూలివోవఁ గరతలం
బున వ్రేసె ని ట్లయ్యిరువురచేత వ్రేటుపడియు సరకుగొనక బలం బెడలక చలంబు
డింపక రావణుండు వహ్నికుండంబులవలన నిర్గమించువిస్ఫులింగంబులుంబోలె
భీషణరోషకషాయితలోచనంబుల నగ్నికణంబు లుప్పతిల్ల గదాదండంబున నాఖం