Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/787

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మండోదరి రావణునకు రోషంబు పెరుఁగ నాడుట

చ.

జనపతి యొద్ద లేనియెడ జానకి ముచ్చిలి తెచ్చి తీవు నీ
దనుజులు నీవుఁ జూడ నిటు దప్పక దెచ్చితి నీదుగేహినిం
గనుఁగొను మంచు గర్వ మది గన్పడ నీకపి యన్నవాక్యము
న్వినియును నీకు లజ్జయు వివేకముఁ గోపముఁ బుట్ట దేలకో.

2568


చ.

హరిహయవైరి సర్వపరమాస్త్రవిదుండు నుదగ్రనందనుం
డురుభుజవిక్రముండు మని యుండిన నీవిపినాటుఁ డీక్రియం
దిరముగ నన్నుఁ బట్టికొని తెచ్చునె పాశియమేంద్రకిన్నరే
శ్వరులకు నైనఁ జూడఁగ వశంబె నిశాచరనాథ నాదెసన్.

2569


ఉ.

వాసవతుల్యుఁ డైనరఘువర్యుని దేవిని మ్రుచ్చిలించి యు
ల్లాసము మీఱ దెచ్చితివి లంకకు శంక యొకింత లేక నీ
దోసము రిత్తవోవునె యధోగతికి న్నినుఁ బుచ్చుఁగా కిల
న్వీసరవోవునే యనుభవించినఁ గాక నిజాపరాధముల్.

2570


ఉ.

కాలము డాయవచ్చిన నకార్యము కార్యము బుద్ధిలోఁ గనం
జాలరు దోచినంతపని సల్పుదు రార్యహితోపదేశము
ల్మేలని చూడ రంతమున మిక్కిలి హాని యొనర్చుసీత నీ
పాలిటికాళరాత్రి యని భావమునం దలపోయఁజాలితే.

2571


ఉ.

రామునిదివ్యసాయకపరంపరల న్సమరంబులోన ను
ద్దామపరాక్రమాధికులు దానవవీరు లనేకు లీల్గి రిం
కేమని చెప్పుదాన నసురేంద్ర యొకండవు చిక్కి తీవు సం
గ్రామజయంబు గల్గు నని రాక్షసనాథ తలంప నేటికిన్.

2572


చ.

కడువడిఁ గాలపాశ మురిగాఁగ మెడం దగిలించుకొంటి వె
క్కడఁ జనవచ్చు నింక బలఘస్మరుఁ డైనను గావ శక్తుఁడే
విడువక యాజి కేగి రఘువీరుని దాఁకి వధింపు గానిచోఁ
దడయక చావు మవ్విభుని దారుణదివ్యశరాభిసంహతిన్.

2573


క.

చి చ్చొడిఁ గట్టినవానికి, వచ్చునె మే లకట రాజవర్యునిదేవిం
దెచ్చినయప్పుడె నీపనిఁ, జచ్చితి వని దలఁచితిని నిశాచరనాథా.

2574


చ.

తలఁగక జన్యరంగమున దాశరథిన్ వధియించు టొండె న
య్యలఘుచరిత్రుదివ్యవిశిఖాహతిఁ జచ్చుట యొండె మాయలున్
బలుమఱు మంత్రతంత్రము లుపాయములు బని సేయ వింక నీ
వలవనియాశ మాని సురవైరికులోత్తమ లెమ్మ చెచ్చెరన్.

2575


మ.

హరిదంతద్విపదంతముల్ పెఱికి దుర్గాధీశుకైలాస మె
త్తి రహిన్ దివ్యధనుర్గుణవ్రణకిణోద్దీప్తంబు లై నిర్జరే