Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/784

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కౌకు ల్మెచ్చఁ గవాటము ల్విఱుగ నొయ్యం దన్ని బాహాబలో
ద్రేకం బొప్పఁగ లంక సొచ్చి విజయశ్రీ మీఱఁగా నేగుచున్.

2549


సీ.

వాజిశాలలు చొచ్చి వాయువేగము గలఘోటకంబుల ధాత్రిఁ గూలఁ దన్ని
కరిమందిరంబుల కుఱికి బల్పిడికిళ్ల భద్రేభకుంభము ల్వగుల మోఁది
రథగృహంబుల కేగి రభసంబుతో శతాంగంబుల నుగ్గునూచంబు సేసి
యాయుధశాలల కరిగి మహాధనుర్విశిఖాదికంబులు విఱిచివైచి


తే.

సౌధములు నేలఁబడఁ దన్ని సాహసమున
వరనిశాచరగృహములు పాడు చేసి
మదగజేంద్రంబు లొక్కట మడువు సొచ్చి
గలఁచినట్లు లంకాపురిఁ గలఁచి రపుడు.

2550


చ.

తమ కెదురైనదైత్యుల నుదగ్రబలంబునఁ బట్టి నేల దు
ర్దమగతి వ్రేయుచున్ ఖరకరంబులఁ దట్టుచుఁ గాళ్ల మెట్టుచు
న్విమతునిఁ బంక్తికంథరుని వేగమె చూపుఁడు మాకు నంచు సం
భ్రమమున యామినీచరుల బాధలు పెట్టి రనేకభంగులన్.

2551


వ.

మఱియును.

2552


చ.

అసమున యాతుధానులగృహంబులు దూఱి చలం బెలర్ప రా
క్షసులను బట్టి యీడ్చికొని గ్రక్కున వచ్చి శిలాతలంబుల
న్విసువక వైచి చంపుచుఁ బ్రవృద్ధుల బాలురఁ బట్టి బల్మిమైఁ
గసిమసిచేసి చంపిరి యఖండపరాక్రమదుర్నివారు లై.

2553

సరమవలనఁ బాతాళహోమగుహ నెఱింగి యంగదుండు గుహలోనికిఁ జొచ్చుట

వ.

ఇట్లు లంకాపురంబంతయు నాకులంబు గావించిన నన్నిశాచరులు తదీయప్రహార
పీడితులై పద్మదళవిలగ్నజలకణంబులమాడ్కిఁ దల్లడం బొందుచుఁ బ్రాణభ
యంబునఁ గొందఱు దశదిశలకుం బాఱిరి కొంద ఱుచ్చైర్నాదంబున రోదనం
బు గావించిరి గొందఱు పాపాత్ముం డగురావణుని దుర్నయంబున నింత పుట్టె నిట్టి
మహోపద్రవం బెన్నఁ డెఱుంగమని కటకటంబడుచుండి రాసమయంబున విభీ
షణునిభార్య సరమ యనునది రావణుండు హోమంబు చేయుచున్న గుహాస్థలంబు
హస్తసంజ్ఞచేత నంగదునకుం జూపిన నవ్వీరో త్తముండు దాని నెఱింగి రయం
బున గుహకడకుం జని గుహవాత వైచియున్నపాషాణంబు పాదప్రహారంబున
నుగ్గునూచంబు చేసి యచ్చటం గావలియున్న రాక్షసుల నిశ్శేషంబుగా వధించి
పుచ్చి గుహలోనికి డిగ్గి యందు.

2554


శా.

అక్షీణద్యుతి యైనవాలితనయుం డచ్చోట వీక్షించె జ
న్యక్షోణీతలనిర్జితాగ్నియమరాడ్యక్షేశరక్షస్సహ
స్రాక్షు న్భూరిపరాక్రమాక్రమితహర్యక్షున్ నిశాటాన్వయా