Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/773

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బును వేదాధ్యయనంబు మంత్రపఠనంబు న్శాంతిహోమాదికం
బును గావింపఁగఁ బంచి దానును మహాపూతాత్ముఁ డై గ్రక్కునన్.

2478


ఉ.

ఏను రఘుప్రదీపకున కెంతయు భక్తుఁడ నేని నిత్యము
న్మానుగ సత్యధర్మనయమార్గమునం జరియింతునేనియున్
మానుగ రామలక్ష్మణు లమానుషచర్యులు సీతఁ గూడి య
క్కానఁ జరించి సేమమునఁ గ్రమ్మఱ వత్తురు గాక వీటికిన్.

2479


వ.

అని పలుకుచున్న నప్పుడు.

2480


క.

తామరసప్రియుకైవడి, వేమఱు గగనంబు దిశలు వెలిఁగించుచు నా
సామీరి వేగ నంది, గ్రామము సేరంగ వచ్చి ఘనసౌధమునన్.

2481

హనుమంతుఁడు భరతునిం గాంచి శ్రీరాములని వ్యాకులచిత్తుం డగుట

సీ.

సజలనీలాంబుదశ్యామలాంగమువానిఁ గమలపలాశనేత్రములవాని
నాజానులంబిబాహార్గళుం డగువానిఁ గంబుసన్నిభ మైనగళమువాని
విపులాంసములవాని వెడఁదవక్షమువానిఁ గమనీయదివ్యవిగ్రహమువాని
రాకేందుసంకాశరమ్యవక్త్రమువాని సమదేభతుల్యయానములవాని


తే.

వరజటాజాలభూషితశిరమువాని
నగ్నివల్కానృతావలగ్నంబువానిఁ
బరమమునివేషమున నున్నభరతుఁ గాంచి
వనచరకులోత్తముఁడు రాముఁ డని భ్రమించి.

2482


ఉ.

అక్కడ లక్ష్మణుండు సమరావని రావణశక్తివిద్దుఁ డై
తక్కక మూర్ఛ వోవఁ గని తద్వ్యసనంబున నిల్వ లేక
నుక్కును బౌరుషం బెడలి యుష్ణకరాత్మజుఁ బోవఁ బంచి యా
చక్కటి జానకి న్విడిచి చయ్యన రాఘవుఁ డేగుదెంచెనో.

2483


మ.

అని చింతించి తదస్త్రసంపద తదీయానూనదోశ్శక్తి త
ద్వినుతప్రజ్ఞయుఁ బౌరుషంబు మదిలో వీక్షించి రాముండు నీ
చనిశాటుం బరిమార లేక నిజవంశఖ్యాతిఁ బోఁ బెట్టి యి
ట్లనుమానింపక వచ్చునే గతరణవ్యాపారుఁ డై వీటికిన్.

2484

భరతుండు హనుమంతునిం జూచి పెనుభూతం బని బాణంబు వేయుతఱి నాకాశవాణి వలదనుట

క.

మదిలోఁ దప్పఁ దలంచితి, నిది యేటివిచార మొదవె నీతఁడు సుగుణా
స్పదుఁ డగురామునిఁ బోలిన, సదమలమౌనివరుఁ డింత సత్యం బరయన్.

2485


క.

అని నిశ్చయించి నభమునఁ, జనుచుండఁగ నవ్వనాటసత్తముఁ గని యా
ఘనభుజుఁడు భరతుఁ డిది యొక, పెనుభూతం బనుచు మదిని విస్మయ మొదవన్.

2486


క.

దీనిఁ బడవైతుఁ గాకని, మానుగఁ జాపంబు గొని సమగ్రవిశిఖ సం
ధానంబుఁ జేసి మౌర్వీ, స్వానము గావించె దశదిశలు కంపింపన్.

2487