Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/763

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కించి బలవంతుం డగుహనుమంతుండు వజ్రాశనిసమస్పర్శం బైనవాలంబున
దానిదంతంబులు విఱుగం బ్రహరించి వైనతేయుండు మహాసర్పంబుం బోలెఁ
దీక్ష్ణనఖంబులఁ గఠోరకంటకభరితం బైనదానినాలుక వెలికిం బెఱికి వైచిన
నది యంతటం బోక రయంబున.

2420


ఉ.

అంబుచరంబుబల్మి మెఱయం బటుదారుణతప్తలోహపిం
డంబును లోలెఁ బావని ననంతపరాక్రమదుర్నివారు శీ
ఘ్రంబునఁ బట్టి మ్రింగె యలుకన్ మునివల్లభదత్తశాపరో
గంబు హరింప భేషజముఁ గాంక్షమెయిం దగ మ్రింగుకైవడిన్.

2421


సీ.

ఆసమయంబున ననిలతనూభవుం డిఁక నేమి సేయుదు నెద్ది తెఱుఁగు
దారుణగ్రాహిణి తప్పక ననుఁ బట్టి దిగిచి మ్రింగఁ దొణంగె దీనిచేతఁ
జావంగ వలసెనో జనవల్లభునికార్య మెట్లగునో తమ్ముఁ డింపు మెఱయ
జీవింపకున్న సుగ్రీవవానరచమూసహితుఁ డై పొలియునో జనకపుత్రి


తే.

విభునిపా టంతయును విని విమతి నొంది, చచ్చునో సూర్యవంశయశంబు కీశ
వంశకీర్తి నశించునో పరఁగ దైవ, మేమి గావింప నున్నదో యింకమీఁద.

2422

హనుమంతుండు మొసలిగర్భంబు చించి దానిం జంపుట

వ.

అని యించుక విచారించి కలవళింప నేల యిప్పు డల్పగాత్రుండనై దీనియుదరం
బు ప్రవేశించి వధింతుఁ గాక యని నిశ్చయించి యంగుష్ఠమాత్రుం డై గరళపు
ముద్దయుంబోలె మండుచు గాఢాంధకారభరితగుహాసదృశం బైనదానికుక్షి
లోనం బ్రవేశించి మహార్ణవమధ్యంబునం బరిభ్రమించుబడబానలంబుచందం
బున నేర్చుచు శరీరంబుఁ బెంచి వజ్రాయుధసంకాశంబు లైనకరరుహంబుల
దానియుదరగతంబు లైననరములు ద్రెంచి నెమ్ములు చూర్ణంబులు చేసి మాం
సంబుఁ జెక్కి సంధులు నుఱుము గావించి ప్రేవులు ముద్ద చేసి యూపిరి వెడలి
రాకుండఁ గంఠబిలంబున కడ్డంబుగాఁ ద్రోచిన నమ్మకరి తదీయవేదన సహింపం
జాలక యిది నాకు నఱుగునాహారంబు గాదు దీన నిక్కంబుగా మరణంబు
సిద్ధించు నని తలంచి యుల్లోలకల్లోలంబులు కడలకుం బఱవ నమ్మహాసరోవర
మధ్యంబునఁ బరిభ్రమించుచు నూపిరి వెడలక కొండొకసేవునకుఁ బంచ
త్వంబు నొందె నప్పుడు తదీయవదనకర్ణనాసారంధ్రవినిస్స్రుతశోణితధారాప్రవా
హంబున నమ్మహాసరోవరసలిలంబు సిందూరితం బయ్యె నంత నమ్మరున్నంద
నుండు దానియుదరంబు భేదించి వెలుపలికి నిర్గమించి ఘోరం బైనమకరి
కళేబరం బీడ్చికొని శీఘ్రంబునఁ దత్సరోవరతీరంబుఁ జేరి రక్తసిక్తాంగుండై ఘనీ
భూతం బైననీహారంబు విరియఁ దట్టి ప్రకాశించుచున్న బాలదివాకరునిపొలు
పునం దేజరిల్లుచు విధుంతుదవదనవినిర్గతుం డైనశశాంకునిపొంకంబున నతి
ప్రియదర్శనుం డై యొప్పె నంత.

2423