Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/731

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జేరి నానాప్రకారంబుల నభినుతించి తత్ప్రసాదంబు వడసి తమనొప్పి యెఱింగిం
చిన నమ్మహాదేవుండు కృపాళుం డై మీకు హితంబు రాక్షసులకు వినాశంబు
సేయుట కొక్కయువతి జనియించు నెమ్మదిగ నుండుండని యానతిచ్చెఁ గావున.

2173


సీ.

ఆచంద్రశేఖరుఁ డానతిచ్చినమాడ్కి నీసీత దేవతాహితముకొఱకుఁ
బ్రభవించె మృత్యువు ప్రళయకాలమునందు మిన్నక ప్రాణుల మ్రింగునట్లు
దనుజేంద్రయుతముగా మనల నందఱు మ్రింగు నీరావణుఁడు దుర్విచారపరత
నిట్టియాపద దెచ్చె నిఁక మన కెవ్వరు శరణంబు కల్పావసానమందు


తే.

భానుసుతుమ్రోలఁ జిక్కిన ప్రజలభంగి
దవముచే వేష్టితము లైనదంతులక్రియఁ
బార్థివునిచేతఁ బొదువంగఁ బడితి మకట
యేమి సేయుద మసురేంద్రుఁ డెంత చేసె.

2174


క.

అని పెక్కుగతుల దనుజాం, గనలు భయము చిత్తమందు గడలుకొనఁగఁ జ
య్యన నొండొరుఁ బట్టుకొనుచుఁ, బెనువగలం బొగిలి రపుడు భీషణభంగిన్.

2175


క.

వారలదుఃఖసమీరిత, భూరినినాదములు బెరసి పురి నింటింటం
దారుణగతి నెగసిన సుర, వైరి విని మొగంబున న్వివర్ణత గదురన్.

2176


తే.

మనమున ముహూర్తమాత్రంబు మౌన మూఁది
యొక్కనిట్టూర్పు నిగిడించి మిక్కుటముగఁ
గినుకఁ బొడమిన నిప్పులు కనులఁ దొరఁగె
నాస్యములు ఘోరదర్శన మై వెలింగె.

2177


తే.

అధరము చలించెఁ గటము లంతంత నదరె
నీడలు కంపించెఁ జెమ్మట లూరె బొమలు
ముడివడియె దంతఘట్టనోద్భూతఘోర
నాద మశనిస్వనంబుచందాన మ్రోసి.

2178


వ.

ఇట్లు యుగాంతాగ్నిచందంబునఁ గ్రోధానలప్రజ్వలితశరీరుం డై యెల్లవారికిం
దేఱిచూడ రాక సమీపస్థు లగురాక్షసుల వేఁడిచూపుల నిరీక్షించి క్రోధావ్య
క్తకంఠుం డై మీరు రయంబున మచ్ఛాసనంబు దెల్పి చతురంగసైన్యంబు
నాయోధనంబునకుఁ గట్టాయితంబు గావింపుఁడు మున్ను రణంబున మద్భ్రాత
లగుమహోదరమహాపార్శ్వులు హతులై రిప్పుడు మత్సచివులై బలముఖ్యులైన
మహోదరమహాపార్శ్వవిరూపాక్షులు సంగ్రామంబునకుం జనువారలుగా నియో
గింపుఁ డని పలికిన నయ్యాతుధానులు తద్వచనప్రకారంబున నందఱకు బవరం
బునకుఁ బైనంబుఁ జెప్పిన నక్తంచరు లందఱు రాజుశాసనంబు నియ్యకొని
భయంకరాకారు లై ధీరు లై వీరాంకవీరు లై నానావిధసాధనంబులు ధరించి
రావణునకుం బొడసూపి యతనిసముచితప్రకారంబునం బూజించి యనుజ్ఞ
గొని కృతస్వస్త్యయను లై తద్విజయంబు గోరుచు సంగ్రామరంగంబునకుం