Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/730

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

ఘనకాయుం డగుకుంభకర్ణుఁడు మహాకాయాతికాయోగ్రకుం
భనికుంభు ల్హరిజిన్మహోదరమహాపార్శ్వుల్ప్రహస్తుం డకం
పనదేవాంతకు లాదిగాఁ గలబలప్రౌఢు ల్నిశాటు ల్రణా
వనిలో నీల్గిరి వీరిదుర్ణయమున న్వాపోవఁ జేసెం బురిన్.

2165


మ.

పతులుం బుత్రులు బాంధవు ల్సచివులు న్భ్రాత ల్కపిశ్రేణిచే
హతు లై రాజి ననేకవాజులు శతాంగానీకముల్ వారణ
ప్రతతుల్ ఘోరపదాతివర్గములు సంగ్రామంబులోఁ జచ్చె న
ద్భుతభంగి న్రఘునాథముక్తవిశిఖస్తోమంబుల న్వ్రేల్మిడిన్.

2166


శా.

రక్షోరాజి వధింపఁ బూని తగ మర్త్యత్వంబు గైకొన్నప
ద్మాక్షుండో హరుఁడో పితామహుఁడొ దేవాధీశుఁడో పాశియో
సాక్షాదంతకుఁడో రఘుప్రవరుఁ డాచందంబు గాకున్న న
ప్రక్షీణద్యుతి నిట్లు రాక్షసులవర్గం బెల్లఁ జక్కాడునే.

2167


మ.

మనవా రందఱు రామబాణములచే మంత్రించిన ట్లాజి మే
దినిలోఁ గూలిరి వీట నింక మనకున్ దిక్కేరు చర్చింప నీ
ఘనదుఃఖాబ్ధికిఁ బార మెద్ది తనువు ల్గంపింపఁగాఁ జొచ్చె నే
మనినం దీఱు దశాస్యుచెయ్దములు వంశాంతంబుఁ జేసెం దుదిన్.

2168


ఉ.

కాంచనగర్భదత్తవరగర్వమున న్దశకంథరుండు తా
నించు కెఱుంగఁ డీరఘుకులేంద్రునిచేఁ దన కైనమోస మ
భ్యంచితవర్యుఁ డైనమనుజాధిపుబారికి నగ్గ మైనచోఁ
బంచత నొందకుండఁ బరిపాటిగఁ బోవఁగఁ జాల రెవ్వరున్.

2169


క.

అనికి వెడలు నపుడెల్లను, మునుకొని కడు దుర్నిమిత్తములు దోఁచుచు రా
మునిచే నితనికి రణమే, దినిఁ జేటగునట్టివిధము దెలిపెడి వరుసన్.

2170


ఉ.

ఈదనుజుండు తొల్లి భువనేశుగురించి తపం బొనర్చి స
మ్మోద మెలర్ప నద్దివిజముఖ్యునిచే వర మందునాఁడు దే
వాదిసమస్తభూతనివహంబులచే నభయంబు వేఁడె న
ట్లాదర మొప్ప వేడఁ డభయం బటు మర్త్యునిచే జడాత్ముఁ డై.

2171


ఆ.

దానఁ జేసి నేఁడు తప్పక మనుజుని, వలన సకలరాక్షసులకు దైత్య
వరుని కిటు వినాశకర మైనఘోరభ, యంబు వొడమె సందియంబు లేదు.

2172


వ.

మఱియుఁ దొల్లి యాదశగ్రీవునిచేత బాధితులై వేల్పులును గంధర్వవిద్యాధ
రాదులును విధాత నుద్దేశించి ఘోరతపంబు గావించి యద్దేవుని బ్రసన్నుం
జేసికొని వివిధప్రకారంబుల నారాధించిన నమ్మహాత్ముండు సంతుష్టుండై దేవత
ల నందఱఁ గలయ నవలోకించి నేఁడు మొదలు మీరు భయంబు దక్కి ముల్లో
కంబులయందు వలసినచోట్ల నెల్ల యథేచ్ఛం జరియింపుఁడని పలికి వారికి హితం
బాపాదించె నయ్యాదిత్యప్రముఖులు పదంపడి భగవంతుం డైనపురాంతకునిం