698 గోపీనాథ రామాయణము కాలాంతకునిచందంబున నతిఘోరదర్శనుం డై యద్ధశ శ్రీ వుండు విలయసమయ మహావాత ప్రేరితవై శ్వానరునిభంగిమండుచుఁ దనమ్రోల నిలువనోపక రాక్షసు లెల్ల భయభ్రాంతు లై పఱవ నెల్లదిక్కులు విలోకించి యుద్ధభీతు లగురాక్షనుల నెల్ల వెఱపు దీఱునట్లుగాఁ బ్రావృట్కాలజీమూతధీరనాదంబున నిట్లనియె. ఉ. నీరజ గర్భఁ గూర్చి పటునిష్ఠ ననేక సహ స్ర వర్షముల్ దారుణభంగి నేను మును తత్పరతం దప మాచరించి సొం పారఁ దపస్సమా ప్తిసమయంబున నమ్మహనీయసత్కృపా ధారుఁ బ్రసన్నుఁ జేసికొని తప్పక పెక్కు వరంబు లొందితిన్. శా. వాణీనాథ కటాక్ష లబ్ధవిలసద్వజ్ర ప్రభోద్య త్తను త్రాణం బొక్కటి యున్న దాకవచ మారలో మరాయోధన ణిం దత్పవిశక్తి గైకొనక మించుకో దాని గైకొన్న గీ ర్వాణుల్ దానవు లైన న న్నెదిరి పోరం జాల రాలంబునన్. తే. మఱియు న దేవ దేవుండు మ త్తపంబుఁ జూచి మెచ్చి కృపాళుఁ డై సురదనుజుల వలన నవ్వి జావు లేకుండ వర మొసంగెఁ గాన నా కెందును భయంబు గలుగు దింక. చ. జలజభవుండు నాకు మును సత్కృప నిచ్చిన విల్లు నమ్మలుకా దలముగ దివ్య వాద్యనినదంబులతోఁ గొని తెండు వాని సొం పలరఁగఁ దాల్చి ఘోర చతురంగ బలంబులఁ గూడి యేగి దో ర్బలమున నాజిలోన నరరాజుల వానకుల స్వధించెదన్. మ. అని యి ట్లాగ్రహ మొప్పఁ బల్కి క్షణదాటాధీశ్వరుం డంతలో దనయ శ్రేష్ఠవధ ప్రభూతపృథుసంతాపంబు కోపంబు పై కొనినం జానకీఁ జంపి కాని వెస నీతో భంబుఁ బావంగ లే నని చిత్తంబునఁ దోఁచిన స్మరల దైత్యశ్రేణితో ని ట్లనున్. మ. అనిలో వానరవంచనార్థముగ మాయాజానికిం జంపె మ తనయుం డత్తఱి నాయుపాయ మంది వ్యర్థం బయ్యె నేనిప్పుడా వనజాతాక్షి నిజంబుగాఁ దునిమి దుర్వారోద్ధతి గ్రాము నా తనితము స్రవిపుత్రు శోకభవసంతాపాబ్ధిలో ముంచెదన్. 2108 2109 2110 2111 2112 2113 వ. అనిఫలికి పుత్రశోకాకుల చేతనుండై రోషా వేశంబున నిర్మలాకాశసదృశం బైన చంద్రహాసంబు కలయం గోని జళిపించుచుభార్యాసచివసమన్వితుండై చరణా హతి మహీతలంబు కంపింప నతిరభ సంబున సీత యున్న యశోకవనంబునకుం జనుచుండి నప్పు డతనితోపాటోపంబు ఁ జూచి రాక్షసు లందఱు సింహనాదంబు సేయుచు నొండొరులం గౌఁగిలించుకొని తమలో 2 టనిరి. 2114
పుట:గోపీనాథరామాయణము2.pdf/721
స్వరూపం