Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

624 గోపీనాథ రామాయణము నరుడు జనింప నొంపఁ దగినట్టి భుజాబలని క్రమాధికుం డరయఁగ లేఁడు మత్సురమునం దొకఁడై నను నేమిసేయుదున్. చ. అనిమిషలోక నాయకుని నాజితలంబున గెల్చి యింద్రజి త్తనఁగఁ బొగడ్త కెక్కిన బలాడ్యుఁడు మతనయుండు గోరి చే సిన మహనీయద తవరచిత్రదురాసదనాగపాశబం ధనము లొకింత యైన రఘునాయకు నొంపఁగఁ జాల వయ్యెఁగా. చ. మఱచినఁ బోదు మోహన మొ మాయయొ మంత్ర మొ సత్ప్రభావమో నరసురయక్ష కింపురుష నాగనభశ్చరసిద్ధ సాధ్యకి న్నరులకు వీడ రానిపటు నాగ శరంబులచే విముక్తులై సురుచిరలీల రాఘవులు సొంపుగ శోభిలు చున్నవా రొగిన్. చ, అరుదుగ నాదుపంపున రణావని కేగినయాతుధాను లెం 1563 1564 1565 1566 1567 దఱు గల రంద జాలమునఁ దప్పక చచ్చిరి గాని రామునిం దరణీకుమారలక్ష్మణయుతంబుగ నొంచి చమూసమూహము స్వరుస వధించి మేలు గొని వచ్చిన వీరునిఁ గాన మొక్కనిన్. శా. సాహంకారత నేగి జన్యమున దేవరాతు లెవ్వానిస ద్భాహావిక్రమనంపదం గెడసి రాధాత్రీశు నాయోధనో త్సాహం బుజ్జ్వలద స్త్రసంపదయు దోర్డర్పంబు వీర వ్రతం బాహా యేమన వచ్చుఁ దత్సముఁడు లేఁ డర్థిం ద్రిలోకంబులన్. -ఆఖరు. రావణుఁడు జాగ్రత్తతో లంకను రక్షించుచుండుఁ డని రాక్షసుల కాజ్ఞాపించుట, చురు- వ. అని బహుప్రకారంబులఁ గొండొకసేపు చింతించి చుట్ల నున్న రాక్షసులు నిరీ క్షించి రామునిభయంబున నీలంక దలంకుచున్నయది మీరంద ఱప్రచుత్తు లై రక్షించుచుండవలయు నశోకవని కామధ్యంబున నెచ్చట సీత రక్షింపంబడు చుండు నచ్చటికి నరవానరులు రాకుండ సర్వప కారంబులం గాచి యుండవల యు మఱియు సర్వగుల్మంబులయందు వేర్వేఱ బలవంతులై న దానవులు స్వసై న్యపరివృతు లై యంతటం గాచికొనియుండువారుగా నియోగింప వలయు మన కేమఱియుండఁ దగదు ప్రదోషార్థ రాత్ర ప్రత్యూష కాలంబులయందు వానర బలంబుల విహారసముద్యోగస్థానంబులు నిత్యంబు నెఱుంగుచుండవలయు నని పలికిన నద్దశగ్రీవునివచనంబు విని రాక్షసులు తద్వచనప్రకారంబునసర్వకార్యం బులకుఁ దగువారల నియమించి రిట్లు దనుజుల కాజ్ఞాపించి రాక్షసేశ్వరుం డగు రావణుండు నిజాలయంబు ప్ర వేశించి మన్యు శల్యంబు వహించిసందీపితతో పాన లుం డై మొగంబున దైన్యంబు దోప రణంబున మృతు లైనకుంభకర్ణాది బా తల సతీశాయ ప్రభృతికుమారులను బ్రహస్తాదిమంత్రులనుం దలంచుకొని శోక బొష్పపరివృతలోచనుం డై మైనుఱచి సారెసారెకు నిట్టూర్పులు వుచ్చుచు D Q i