586 గోపీనాథ రామాయణము సంగ్రామంబునకుం బోవుచుఁ దనచుట్ల నున్న రాక్షసుల నిరీక్షించి పాతాళ వివర తుల్యం బై నవక్త్రంబు విచ్చి ప్రహసించుచు ని ట్లనియె. 1804 1305 ఉ. దానవులార యేను భుజదర్ప మెలర్ప రణంబులో బృహ ద్భానుఁడు విక్రమించి శలభంబులు నేర్చినమాడ్కిఁ గిన్నతో వానరముఖ్యయూథపుల వారక వ్రేల్మిడిలో దహించి య మానవనాథనందనుల మానక యిప్పుడె మ్రింగి పుచ్చెదన్. క. ననుఁ జూచినంత శక్రా, ధ్యనిమిషపతు లడలి పఱతు రనిలో నా కీ వనచరులఁ జంపు టది యొక, పనియే మశకములనట్లు బారి సమర నే. 1306 క. పురరోధమునకు మూలం, బరయఁగ నరవిభుఁడు రాముఁ డతఁడు దెగిన వా నరు లవుడె తెగిన వారలు, దురమున ము న్నతనిమీఁదఁ దొడరఁగ వలయున్. -00009. కుంభకర్ణున కశుభనిమి తము లగుపడుట. భారణం- చ. అని యిటు రావణావరజుఁ డాడిన వాక్యము లాలకించి యా దనుజు లశంకితాత్ము లయి తద్దయు వేడ్క బహూకరించుచుకో ఘనములమాడ్కి నిష్ఠురముగా నినదంబు లొనర్చి రప్పు డా దనుజునిమ్రోలఁ దోఁచె వితతంబుగ దారుణదుర్నిమిత్తముల్ . 1308 సీ. ఘోరంబుగా మోలిలఁ గురిసె నెత్తురువాన కడువడిఁ బిడుగులు పడఁ దొణం గె వననిధి శై లకానససహితంబుగా సర్వసర్వంసహాచక్ర మడ లెఁ బెనుమంట లుమియుచు భీషణభంగిఁ గౌళికములు వాపోయె శితమహాస్త్ర శూలంబు పై గ్రద్ద వ్రాలెఁ బతులు గట్టె మాటికి నపసవ్య మండలములు తే. భాస్కకుఁడు చాల మందగభ స్తి యయ్యె వేఁడిగాడ్పులు విసరె నవ్వి బుధవైరి యెడమకన్ను చలించె ఫణీంద్రతుల్య భుజము కంపించె సతనిపై రజము సుడిసె. ' 1809 వ. ఇట్లు సముస్థితంబు లై నరోమహర్షణమహోత్పాతంబు లవలోకించి గణింపక కుంభకర్ణుండు కృతాంతబల చోదితుం డై యడ్డంబు వచ్చిన సౌధ విమాన గోపుర ప్రాకారద్వారంబుల దాఁటుచు నగరంబు వెలువడి మహాభ్ర ఘన ప్రఖ్యం బై యద్భుతం బై నిండి యున్న వానరబలంబు నవలోకించి శిలోచ్చయనహి తంబుగా సముద్ర జలంబులు పొంగి పొరల నొక్క మహానాదంబు చేసిన మహా గిరిసంకాశుం డై సకుంభకర్లు నవలోకించి తిరస్కృత ప్రళయకాలధారాధర స్తని తం బైనతదీయకంఠనానంబు విని వానరు లెల్ల సింగంబుఁ గన్న లేళ్లచందం బున భయభ్రాంతులై కొందఱు వాతాహతంబు లైన మేఘంబులభంగి దళ దిశలకుం బఱచిరి కొందఱు నికృత్తమూలంబు లగుసాలవృక్షంబులమాడ్కి మహీతలంబునం బడి రిట్లు తన రాకకు భయంబు నొంది నానా ప్ర కారంబులం
పుట:గోపీనాథరామాయణము2.pdf/609
స్వరూపం