Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లోకపరలోకోపయోగిధర్మార్థకామరూపకర్మఫలంబు పురుషులచేత ననుభవితం
బగుచున్న దవ్విధంబున యథేచ్ఛాచారుండును గళ్యాణకర్మఫలంబుల ననుభ
వించుం గావున విహితంబై శుభప్రదం బనియును నిషిద్ధ.........కా
దనియును ధర్మార్థకామంబులకు ఫలనియమంబు లేదు సర్వధర్మంబు ..బున
కుం జెల్లు నని పల్కి వెండియు నియ్యర్థంబు విమర్శించి రావణుండు కావించిన
సీతాపహరణం బస్మదాదులచేత ననుమతం బైనయది యనుభావం బెఱింగి
చుట కి ట్లనియె.

1277


తే.

అసురపతిచే సునిశ్చితం బైనజనక, జాపహరణకర్మంబు మా కభిమతంబు
యరులవిషయంబునందు సాహసము వలయు, నందుదోషంబు లేదు సురారివర్య.

1278


వ.

ఈపక్షంబునందు రావణునిచేత నచాతుర్యకృతం బొకింతయైన ధర్శింపంజేయుట
కశక్యం బని పలికి కుంభకర్ణైకాభియానపక్షంబు నిరసించుటకు మరల ని ట్లనియె.

1279


తే.

భండనంబున కే నొక్కరుండ నిప్పు
కరిగెన నటంచుఁ బలికితి వసురనాథ
యం దయుక్త మసాధ్య మత్యవహితంబు
హానియును దోఁచె నది యెట్టు లనిన వినుము.

1280


ఉ.

మానుగ మున్ను రోష మభిమానము గల్గినరాక్షసు ల్జన
స్థానకృతాలయు ల్ప్రబలదర్పులు రామునిచేతఁ జచ్చి ర
మ్మానవనాథు శూరజనమాన్యు ననంతబలాభిగుప్తునిన్
మానుగ నొంటి నెట్లు కదనంబున గెల్చెన వీవు రాక్షసా.

1281


తే.

మును జనస్థానమందు రామునిమహోగ్ర, విశిఖరయమున కోర్వక వెఱచి వచ్చి
నట్టిరాక్షసు లిప్పటి కడలు విడిచి, ధైర్య మొంద లేకున్నారు దనుజవర్య.

1282


సీ.

అసురనాయక సుప్తుఁ డైనవాసుకినట్లు హరిభంగి సంక్రుద్ధుఁ డైనరామ
మనుజేంద్రు నజ్ఞానమునఁ బ్రబోధింపంగఁ దలఁచితి వతఁడు ప్రతాపవంతుఁ
డాజిదురాసదుం డగ్నికల్పుఁడు శౌర్యఘనుఁడు మృత్యువుభంగిఁ గ్రాలువాఁడు
వానిముంగలికిఁ బోవంగ నెవ్వం డోపు జగతీశుఁ డభిముఖుం డగుచు నుండ


ఆ.

సంశయస్థ మయ్యె సర్వంబు నీమతం, బట్లు గాన నొంటి నాలమునకుఁ
బోవఁ దగదు వినక పోయిన వచ్చెట, నీకుఁ గీడు వచ్చు నిక్కువముగ.

1283


తే.

అరయ హీనార్థుఁ డైనవాఁ డవని నెవ్వఁ, డసురవర్య సమృద్ధార్థుఁ డైనరిపునిఁ
బ్రాకృతునిఁగాఁ దలంచి నిరాకరించి, తనదుప్రాణంబు పోఁగొట్టుకొనఁగఁజూచు.

1284


తే.

వాసవసమానుఁ డెవ్వఁ డెవ్వనికి మనుజు
లందు నెవ్వాఁడు సముఁడు లేఁ డప్రతిహత
కార్ముకుం డెవ్వఁ డట్టిరాఘవునితోడ
నొంటిసంగ్రామ మొనరింప నొప్పు గలదె.

1285