524 గోపీనాథ రామాయణము శా.ఆలో దైత్యులు విక్రమించి పటు బాహాటోఫు లై పావక జ్వూలాభీల పటు స్ఫులింగ పటలీ సంచార ఘోరంబుగా శూలంబు ల్వడిఁ బూన్చి బిట్టలుకతో శుంభద్ధతి న్వేసి రా శైలాటధ్వజినీకదంబములపై సాంద్రంబుగా నుద్ధతిన్. శా.విద్యుద్వల్లులమాడ్కి_ఁ దోఁకలు వియద్వీథిం బ్రకాశింపఁగాఁ బ్రోద్యద్భాహుబలాతి రేక మడరం బొల్పొంద సంగ్రామసం పద్యోగం బటు చూచి వేల్పులు నుతింప న్వీఁకతో రాక్షసు ల్సద్యోమృత్యువు నొంద తా ల్గురిసి రాశై లాటవంతో త్తముల్. ఉ. దైత్యులు విక్రమించి పటుకర మెలర్పఁగ నాక్రమించి త త్రత్యఘనస్వనంబు బెడిదంబుగ నింగిఁ జెలంగ జన్యపాం డిత్యము రూఱ ఘోరముగ నిష్ఠురఖడ్గము లేసి దోర్బలౌ ద్ధత్యముఁ జూవీ రప్పుడు మనం బడఁగ నహనాటకోటికిన్ . ఉ. అక్షయ బాహుశౌర్యులు దురాసదు లు గ్ర భుజు ల్వనాటహ ర్యక్షులు విక్రమంబు చెలువారఁ గృతాంతసమ ప్ర భావు లై దక్షత నేగి వజ్ర సమదారుణ శాతనఖంబుల స్వడీ నాక్షసకుంభిమ స్తములు ప్రక్కలు వావిరి పెక్కు భంగులన్. వీరు ల్దానవు లొక్క భంగిఁ బటుదోర్వీర్యం బవార్యంబుగా శూరత్వం బిఁక మాకు వెన్నటి కటంచుం జూల నారి న్వే మొఱయించి మంట లుమియ న్నా నాసమానాంబకా సారంబు న్గురియించి రుగ్రగతిఁ గీళశ్రేణిపై బల్విడిన్ . మ. హరివీరు ల్గడుసాహసం బడర నుద్యద్దృ ప్రశార్దూలము ల్రురుడింభంబుల నాక్రమించిన క్రియ ద్రోపోద్ధతి న్యామినీ చరుల న్భీషణపై ఖరిం బొదివి భాస్వ తీకుదంతంబులం గర ముద్వృత్తి శిరంబులం గొఱికి వీఁకం జంపి రేపారఁగన్. చ. అసురులు భీతిఁ జెందక దురాగ్రహులై భయదస్వసంబుతో ననమున డాసీ వజ్రకఠినాయసదీర్ఘ హరిధ్వజోల్లన మ్ముసలములం గరంబుల సముత్సుకతం గొని దోర్బలంబుల న్విసరి వనాటకోటిపయి నేర్పున పై చిరి దర్ప మేర్పడన్. సీ, కాలాయసమయోగ్ర కఠినముద్గరములు విసువక పలుమఱు వేసి వేసి పవిసన్ని భ స్పర్శ పట్టే సాయుధముల మచ్చరంబునఁ జాల గ్రుచ్చి కుచ్చి య సంక్రుద్ధు లై 910 911 912 915 914 915 916 అగ్ర, కఠినో గ్ర దీర్ఘకుంతంబులఁ గడుపడి విడువక పొడిచి పొడిచి కాంచనవలయసంకలితో గ్ర గదలచే ను తలపడ వడి మొత్తి మొత్తి తే, భయదగతి శక్తితో మర ప్రాసపరిఘ, ముద్దర పరశ్వథంబుల మోఁది మోఁది సమదగతిఁ జండ రాక్షను ల్సంగరమున, మించి వానరబలము నొప్పించి రపుడు.
పుట:గోపీనాథరామాయణము2.pdf/547
స్వరూపం