Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డము. న్యానతపైరి నంగదుని యంగము నొవ్వఁగ నేసి యార్చినన్. ఉ. కోపముఁ బెంచి యంగదుఁడు ఘోరభుజబలదర మొప్పఁ ద చాపము ద్రుంచి యశ్వముల సారథి నొక్కటఁ జంపి వహ్నికీ లోపమకాంచనధ్వజము నుర్వరఁ గూల్చి రథంబు ద్రుంప వాఁ డేపు దొఱంగి వేగ చనియెం దగ నొండొక తేరిమీఁదికిన్, ఉ. ఆతతవి క్రమంబు పొలుపారఁ బ్రజంఘుఁడు భూరిజంఘుఁ డ ఙ్ఞాతసఖాంశుతుల్యవిలసత్ప్రదర త్రయవిద్ధుఁ జేయ సం పాతి మనంబులోఁ గినుక పర్వ రణంబున సశ్వకర్ణభూ జాతమున న్ని శాచరునిఁ జయ్యన వేసె మదం బడంగఁగన్. 499 727 729 730 731 + జంబుమాలిమి త్రఘ్న వ జ్ర ముష్ట్యశని ప్రభులు హనుమద్విభీషణమైందద్వివిదులచేఁ జచ్చుట. ఆ చ. అరదముమీఁదనుండి రయమార మహోగ్రుఁడు జంబుమాలి భీ కరతరకోపవేగమునఁ గన్నుల నగ్నికణంబు లొల్కంగా సురుచిరశ క్తి చేఁ బవనసూనుని తొ మ్మదరంగ వ్రాసినం బరువడి నవ్వనాటకుల పాలుఁడు కోపరసోగ్రమూర్తి యై. ఉ. వానిరథంబుపై కుటికి వాజులు గీటణఁగించి సారథిక్ మానక చంపి హేమమయనవ్య యుగధ్వజచక్ర కూబర స్థానములం బదాహతి రస న్వెసఁ గూలఁగఁ దన్ని పాణిచే వానీయురంబు దట్టుటయు నాఁ డీలఁ గూలెఁ గుజంబుచాడ్పునన్. మ, పది తూపు ల్ని గిడించి శీఘ్రము నిలింపద్రోహి మిత్రఘ్నుఁడుం గదనానకు విభీషణుం బొదివినం గాలాంతకాకారుఁ డె గదచే నాతఁడు వానితొమ్మ పటు దోర్గర్వం బఖర్వంబుగా విదళించె న్సురసిద్ధ సాధ్యులు దివి స్వేనోళ్లఁ కీర్తింపఁగన్. చ, మసలక వజ్రముష్టి యలమైందుని సాయక విద్దుఁ జేసిన న్వెస నతఁ డాగ్రహించి భుజవీర్య మెలర్పఁగఁ దచ్ఛతాంగము న్విసువక యశ్వసారథులవిద్రును కేతన ముర్విఁ గూల్చి య య్యనురునిఁ జంపె ముష్టిహతి సద్రి చరు లుద మంది చూడఁగన్. చ. ద్వివిదుఁడు వేడ్క నొక్క పృథివీధరశృంగముఁ దెచ్చి తోడివా రవు నన దోర్బలం బెనఁగ నయ్యశని ప్రభుమీఁద నేసినం బవినిభతీక్ష బాణములఁ బర్వతము న్విదళించి దైత్యుఁ డా ద్వివిదునిమీఁద నేసెఁ బటుతీ న సుపర్వశి శాస్త్రజాలముల్, చ. వనచరవీరుఁ డిట్లు పరివర్ధిత సాయక విద్ధగాత్రుఁ డై మనమున నాగ్రహం బోదవ మానక వాజులు గీటణంచి నూ తునిఁ దెగటార్చి కేతనము ద్రుంచి శతాంగము గూలఁ దన్ని య ద్దనుజునిఁ గూలవై చెం బటు దారుణ పాణితలాభిసంహతిన్. 132 738 781