యు 130 డము. 481 చయసంస్థిత వినీలనిశాచరపరివృతం జైద్వితీయవరణభూతయు యుద్ధ సన్నద్ధమహారా క్షసకోలాహల బహుళంబైయున్న లంకాపురంబు నవలోకించి మహామేఘంబుల భంగి నింగి పగుల భైరవారావంబులు సేయుచు రాముని పార్శ్వంబులం గొలిచి యుండి రంత సంధ్యా ప్రతిరంజతుండై సూర్యుం డస్తమించెఁ బదంపడి పూర్ణ చంద్ర ప్రదీప యైన శర్వరి ప్రకాశించె నప్పుడు రాముందు వానరదానన నాయకు లగును శ్రీ వవిభీషణుల చేత నభినందితుం డై యూధ పయూథంబులు పరి వేష్టింప లక్ష్మణ సహితంబుగా న ప్పర్వత పృష్ఠ భాగంబున యధాసుఖంబుగా నదివసించె వంత సూర్యోదయం బగుటయు వానరపుంగవు లందఱు దృష్టి చిత్తాపహారిణి యైనలంక నవలోకించి జాతివిస్మయు లై తమలో నిట్లనిరి. 621 సీ. చందనతిందుకమందారమా కందనాశద్రువున్నాగపూగములును సాలహింతాలతమాలతాలంబులు కింశుకశింశుపావంశములును శృంగారలుంగలవంగ నారంగము లటకుటజాశ్వత్థవిట సములును ఖర్జూరభూర్జరీసర్జకదంబము లంబీరనింబకదంబములును తే, రమ్య ఫలయుతకుసుమితా గ్రంబులై ల, తాపరిగతంబులై సమాతతసుగంధ బంధురములై మహోన్నతపాదపములు, నరలుచున్నవి కంటిరెపురముచుట్టు, తే. ర క్తకోమలవిక సితరమ్యచిత్ర, కుసుమపరిపూర్ణ శాడ్వలోల్లసితచిత్ర నీలవన వాటికలచేతఁ గ్రాలుచున్న, దీపురము చూడుఁ డతుల కింపుగాఁగ. 623 క. వనవృక్షంబులు కంటిరె, పనివడి గంధాఢ్యరమ్య ఫలకునుమముల వినుతగతిఁ దాల్చు చున్నవి, మనుజులు ఘనభూషణముల మాడ్కిం బెలుచన్. తే, చారుతరకుందమందారస ఫ్లవర్ల కుసుమసంసర్గసురభి యై శ్వసనుఁ డిపుడు మాణసుఖ కారియై పథిశ్రమము పాయ నుడియు చున్నాఁడు విజయసంసూచకముగ. శా.ఆలోకింపఁగ నయ్యె మ్రోల నొక యుద్యానంబు సర్వర్తుకం బై లీలాయుతషట్పదధ్వనియుతం బై రమ్యపుష్పాఢ్య మై లోలజ్కో కిలకాకలీకలిత మాలోకోత్సవాదాయి. యై యా లేఖేశ్వరకిన్న రేశ్వరమహోద్యానంబుల న్మీఱుచున్. దంతం వానరులు సనంబులు సొచ్చి విహరించుట. గురిం 625 626 వ. అని బహు ప్ర కారంబులం గొనియాడుచుఁ గామరూపు లగుహరిపుంగవులు సుగ్రీవు చేత ననుజ్ఞాతులై కోకిలాకులవండంబులునుభృంగరాజాభిగీతంబులును నిత్యను తవిహంగమంబులును సొరసాభిరుతంబులును ఖంజన విఘుష్టంబులునగు నమ్మహోద్యాన వనోపవనంబులు సొచ్చి విచ్చలవిడి పొదవిన్యాసంబులం బుడమి గ్రక్కదల లంకాపురం బట్టిట్టు నడ్డాడనుచ్చైర్నాదంబులు సేయుచుఖగమృగ 141
పుట:గోపీనాథరామాయణము2.pdf/503
స్వరూపం