Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బులకరణిఁ గ్రాలుచు సముద్రతీరవనంబులందును నదులందును బర్వతములయం
దును నిండి మెండుకొని యూర్జితగర్జానిస్వనంబులు చెలంగ దారుణప్రకారం
బున నిన్ను డాయవచ్చుచున్నవారు వారె భల్లూకయూథపు లవలోకింపుము
మఱియుఁ దన్మధ్యదేశంబున జీమూతపరివృతుం డైనపర్జన్యునిసొబగునం దేజ
రిల్లుచుఁ గ్రోధారుణితలోచనంబుల నగ్నికణంబు లలర ఘోరదర్శనుం డై యున్న
వాఁడు వాఁడె ధూమ్రుం డనుయూథపశ్రేష్ఠుం డతండు సమస్తభల్లూకలోక
నాయకుండు ఋక్షవంతం బనుగిరిశ్రేష్ఠంబున నివసించి నర్మదాజలంబు లుప
యోగించుచు నచ్చటిరాజ్యంబు పాలించుచుండు మఱియును.

600


ఉ.

వానికి నగ్రజుం డఖిలవానరలోకనమస్కృతుండు జ
న్యానతశాత్రవుండు కుధరాభశరీరుఁడు సర్వవీరస
మ్మానితుఁ డుగ్రరూపుఁ డసమానపరాక్రముఁ డత్యుదాత్తతే
జోనిధి జాంబవంతుఁ డనుశూరవరేణ్యుఁడు వాఁడె చూడుమా.

601


వ.

ఇతండు మహాయూథపయూథపుండు రూపమాత్రంబుచేత భ్రాతృసముం డగుం
గాని వీర్యవిక్రమంబుల నతనికంటె నధికుండు సంగ్రామంబున నధికదుర్జయుండు
ప్రశాంతచిత్తుండును గురువర్తియుఁ జిరజీవియు నని విశ్రుతిం గన్నవాఁడు నితండు
తొల్లి శక్రునకుం దోడ్పడి సమరంబున బలవంతు లైనరాక్షసుల ననేకుల వధించి
దేవతలచేత దుర్లభంబు లైనవరంబులు వడసినవాఁడు మహామహీధరశృంగంబు
లుత్పాటించి కందుకక్రీడ లాడుచు మహావేగంబున నిరువదియొక్కమాటు
త్రివిక్రమరూపంబునకుఁ బ్రదక్షిణంబు చేసినమహానుభావుం డతనినామంబు
విన్న మృత్యు వైనఁ బరు వెత్తు నితనికి దైత్యదానవపిశాచసమానంబు లగు
భల్లూకబలంబు లసంఖ్యేయంబులు గలిగి యుండు వానరయూథపు లెల్ల నమ్మ
హాయూథపయూథపునిం బరివేష్టించి యున్నవారు విలోకింపుము.

602


చ.

దనుజవరేణ్య కంటె యల దానవభంజను నర్థిఁ గొల్చి య
య్యనఘునిచేత దుర్లభము లైనవరంబులు గాంచి ప్రీతితోఁ
దనదుబలంబులం గొనుచు దారుణభంగి రణం బొనర్పఁగా
ఘనగతి వచ్చువాఁ డతఁడె కా ఋషభుం డనుయూథపుం డొగిన్.

603


తే.

ధరఁ జతుష్పాదజంతుయూథములయందు
ఘనత నెవ్వానిరూపంబు కంటెఁ బరమ
మైనరూపంబు లే దట్టియధికుఁ డల్ల
వాఁడె సన్నాదుఁ డనియెడువానరుండు.

604


వ.

అతండు సర్వవానరపితామహుం డనియును యూథపయూథపుం డనియును
వినంబడు నితండు తొల్లి శక్రునిం దొడరి ఘోరం బగురణం బొనర్చి పరాజ
యంబు నొందక యతనిచేత మెచ్చు వడసిన పరాక్రమశీలుం డతండు యోజన
దూరస్థితం బైనశైలంబును బార్శ్వంబున సంస్పృశించుచు నట్ల గమనవేళ