45% గోవీనాథ రామాయణము బులకరణిఁ గ్రాలుచు సముద్రతీరవనంబులందును నదులందును బర్వతములయం దును నిండి మెండుకొని యూర్జిత గ దానిస్వనంబులు చెలంగ దారుణప్ర కారం బున నిన్ను డాయ వచ్చు చున్నవారు వారె భల్లూకయూథపు లవలోకింపుము మఱియుఁ దనధ్య దేశంబున జీమూతవరివృతుం డైనపర్జన్యుని సొబగునం దేజ కల్లుచుఁ గ్రోధారుణీతలోచనంబులు నగ్నికణంబులలర ఘోరదర్శనుం డై యున్న వాఁడు వాఁడె ధూమ్రుం డనుయూథప శ్రేష్ఠుం డతండు సమ సభల్లూకలోక నాయకుండు ఋతువంతం బనుగిరిశ్రేష్ఠంబున నివసించి నర్మదాజలంబు లుప యోగించుచు నచ్చటిరాజ్యంబు పాలించుచుండు మఱియును. ఉ. వానికి నగ్రజుం డఖల వానరలోక ననుస్కృతుండు జ న్యానత శాత్రవుండు కుధరాభశరీరుఁడు సర్వవీరన మానితుఁ డుగ్రరూపుఁ డసమాన వరాక్రముఁ డత్యుదా త్తతే జోనిధి జాంబవంతుఁ డనుశూరవ రేణ్యుఁడు వాఁడే చూడుమా. 600 601 న. ఇతండు మహాయూథపయూథపుండు రూపమాత్రంబుచేత భ్రాతృసముం డగుం గాని వీర్యవి క్ర మంబుల నతనికంటె నధికుండు సంగ్రామంబున నధిక దుర్జయుండు ప్రశాంత చిత్తుండును గురువర్తియుఁజిరజీవియు నని విశ్రుతిం గన్న వాఁడు నితండు తొల్లి శక్రునకుం దోడ్పడి సమరంబున బలవంతులై నరాక్షసుల న నేకుల వధించి దేవతల చేత దుర్లభంబులై నవరంబులు వడసినవాఁడు మహామహీధరశృంగంబు లుత్పాటించి కందుక క్రీడ లాడుచు మహావేగంబున నిరువదియొక్క మాటు త్రివిక్రమరూపంబునకుఁ బ్రదక్షిణంబు చేసినమహానుభావుం డతనినామంబు నిన్న మృత్యు వైవఁ బరు వెత్తు నితనికి దైత్యదానవపిశాచసమానంబు లగు భల్లూకబలంబు లసంఖ్యేయంబులు గలిగి యుండు వానరయూధపు లెల్ల నమ్మ హాయూథపయూథపునిం బరివేష్టించి యున్న వారు విలోకింపుము. చ. దనుజన రేణ్య కంటే యల దానవభంజను నర్థిఁ గొల్చి య య్యనమునిచేత దుర్లభము లైనవరంబులు గాంచి ప్రీతితోఁ దనదుబలంబులం గొనుచు దారుణభంగి రణం బోనర్పఁగా ఘనగతి వచ్చువాఁ డతఁడె కా ఋషభుం డనుయూథపుం డోగిన్. తే. ధరఁ జతుష్పాద జంతుయూథములయందు ఘనత నెవ్వానిరూపంబు కంటెఁ బరమ మైనరూపంబు లే దట్టియధిక:c. డల్ల వాఁడే సన్నాదుఁ డనియెడు వానకుండు. 602 603 604 న. అతండు సర్వవానరపితామహుం డనియును యూథపయూథపుం డనియును వినంబడు నితండు తొల్లి శక్రునిం దోదరి ఘోరం బగురణం బొనర్చి పరాజ యంబు నొందక యతనిచేత మెచ్చు వడసిన పరాక్రమశీలుం డతండు యోజన దూరస్థితం బైన శైలంబును బార్శ్వంబున సంస్పృశించుచు నట్ల గమన వేళ
పుట:గోపీనాథరామాయణము2.pdf/474
స్వరూపం