Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఈవలవనివిచారంబు విడిచి పాపకర్ముం డగురావణునివధప్రకారం బూహించి
సేతుబంధనవిధానంబున సముద్రంబు దాఁటునట్లుగా సముచితప్రయత్నఁబు
గావించి లంకాపురప్రాంతకాంతారంబు ప్రవేశించునట్లుగా సంఘటింపు
మని పలికి వెండియు ని ట్లనియె.

22


చ.

అరిమథనా యగాధ మగునవ్వరుణాలయమందు సేతువు
న్గురుమతిఁ గట్టినంతనె త్రికూటనగస్థిత యైనలంక సొం
పఱినది గాదె లంక చెడినప్పుడె నీదురిపుండు పంచతన్
దఱిసినవాఁడు గాఁడె ఘనతావకదివ్యశరాభిసంహతిన్.

23


తే.

అంబునిధియందు సేతు వింపారఁ గట్టి
మొనసి లంకాపురము చుట్టుముట్టు టదియె
తడవు గాని మహీవరోత్తంస పంక్తి
వదనుఁ జచ్చినవానిఁగా మదిఁ దలంపు.

24


తే.

ఆర్యజనులు శోకంబు శౌర్యాపకర్ష
ణం బనుచుఁ బల్కుటది నిక్కువంబు గానఁ
గార్యనాశిని యైనయీకలుషబుద్ధి
వీరసమ్మత దగ దయ్య విడువు మిపుడు.

25


తే.

అనఘచారిత్ర శౌండీర్య మాశ్రయించి
యొప్పు దప్పక కార్యంపుఁ జొప్పు నడపు
నట్టివాఁ డెట్టివిషమమం దైనఁ జెడక
ప్రబలుఁ డై మించి యిష్టార్థభాగి యగును.

26


క.

అనఘ మహాత్ములు విక్రమ, ఘను లగుమిముబోఁటివారు కడుశోకము గై
కొన రెంత కష్టమందై, నను నది సర్వార్థనాశనం బనుతెల్విన్.

27


తే.

బుద్ధిమంతులలో నుత్తముఁడవు నీవు
సర్వశాస్త్రార్థతత్త్వవిశారదుఁడవు
విక్లబం బైనచిత్తంబు విడిచి పగఱ
నణఁపఁ బూనుము మత్సహాయత్వ మొంది.

28


తే.

పార్థివోత్తమ వరధనుష్పాణి వైన, నీకు నెదిరించి రణమున నిల్వ నోపి
నట్టివీరుఁడు భువనత్రయంబునందు, నరసి చూచిన లేఁ డొక్కఁ డైనఁగాని.

29


వ.

దేవా నిరుద్యోగు లగుక్షత్త్రియులు మందభాగ్యు లగుదురు సర్వజనంబులు నతి
క్రోధశీలునకుఁ దలంకుదురు గావున నీవు శోకంబు విడిచి క్రోధం బవలంబింపు
మని పలికి వెండియు ని ట్లనియె.

30


తే.

వృక్షచరసేనచేఁ బరివృతుఁడ వైన, నీకు దుర్లభ మెద్ది లే దోకకుత్స్థ
వంశభూషణ జలధి దుర్వారభంగి, దాఁటి జానకి నీక్షించెదవు నిజంబు.

31