872 గోపీనాథ రామాయణము న, ఈ వలపనివిచారంబు విడిచి పాపకర్మం డగు రావణునివధ ప్రకారం బూహించి సేతుబంధన విధానంబు. సముద్రంబు దాఁటునట్లుగా సముచిత ప్రయత్నఁబు గావించి లంకాపుర ప్రాంత కాంతారంబు ప్రవేశించునట్లుగా సంఘటింపు మని పలికి వెండియు నిట్లనియె. చ. అరిమధనా యగాధ మగునశ్వరుణాలయమందు సేతువు న్గుగుమతిఁ గట్టినంతనె త్రికూటనగస్థిత యైనలంక సొం సతీనది గాదె లంక చెడినప్పుడె నీదురిపుండు పంచత వఱిసినవాఁడు గాఁడె ఘనతావక దివ్యశ రాభిసంహతిన్. తే. అంబునిధియందు నేతు వింపారఁ గట్టి మొనసి లంకాపురముచుట్టు ముట్టు టదియె తడవు గాని మహీవరో తంస పం 1 పదనుఁ జచ్చిన వానిఁగా మదిఁ దలంపు. ఆర్యజనులు శోకంబు శౌర్యాపకర్ష ణం బనుచుఁ బల్కుటది నిక్కు నంబు గానఁ కలుష బుద్ధి కార్యనాశిని యైన వీరసమ్మత దగ దయ్య విడువు మిపుడు. తే. అనమచారిత్ర కౌండీర్య మాశ్రయించి యొప్పు దప్పక కార్యంపుఁ జొప్పు నడపు నట్టివాఁ డెట్టివిషమమం దైనఁ జెడక ప్రబలుఁ డై మించి యిష్టార్థ భాగి యగును. క. అనఘ మహాత్ములు విక్రమ, ఘను అగుమిముబోఁటివారు కడుకోకము కొన రెంత కష్టమందై, నను నది సర్వార్థ నాశనం బను తెల్విన్. తే. బుద్ధిమంతులలో ను త్తముఁడవు నీవు సర్వశాస్త్రార్థత త్వవిశారదుఁడవు విక్లబం బైనచిత్తంబు విడిచి పగఱ నణఁపఁ బూనుము మత్సహాయత్వ మొంది 22 23 24 25 26 27 28 తే. పార్థివో త్తమ వరధనుష్పాణి వైన, నీకు నెదిరించి రణమున నిల్వ నోపి నట్టివీరుఁడు భువనత్రయంబునందు, నరసి చూచిన లేఁ డొక్కఁ డైనఁగాని. 29 త. దేవా నిరుద్యోగు లగుకు, త్త్రియులు మందభాగ్యు లగుదురు సర్వజనంబులు నతి క్రోధశీలునకుఁ దలంకుదురు గావున నీవు శోకంబు విడిచి క్రోధం బవలంబింపు మని పలికి వెండియు నిట్లనియె. తే. వృక చర సేన చేఁ బరినృతుఁడ వైన నీకు దుర్లభ మెద్ది లే దోకకు సంశ భూషణ జలధి దుర్వారభంగి, దాఁటి జానకి నీక్షించెదవు నిజంబు. 80 31
పుట:గోపీనాథరామాయణము2.pdf/395
స్వరూపం