Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

364 గోపీనాథ రామాయణము క, కడు రయమునఁ గాకము వెంబడిఁ బడి డఱుమంగ భీతిఁ బఱచి యది నురేం ద్రుఁడు మొదలగు సమురవరుల, యడుగులఁ బడి వారిచేతఁ దృక్తంబగుచున్. క. జగములు మూఁడును గ్రుమ్మరి, ఖగము పరిత్రాత నెందు గానక నెసఁ దా మగుడి చనుదెంచి భయమున, జగన్నుతుఁడ వైననిన్ను శరణము నొందె. వ. ఇట్లు శరణాగతం బైనబలిభోజనంబు నిరీక్షించి యది వధారంబైనను శరణా గతరక్షణంబు నిూకుఁ బ్రధానగుణంబు గావున దానిఁ గృపార్ధవిలోకనం బుల నవలోకించి మదీయాస్త్రంబు మోఘంబు సేయుట కశక్యంబు నీవక్షిణ నేత్రం బొసంగి ప్రాణంబులు రక్షించుకొని యథేచ్ఛం జను మని మీ రాస లిచ్చిన నక్కా కంబట్లుగావించి మీకును దశరథునకును నమస్కారంబుగావించి యనుజ్ఞ గొ గోని నిజనివాసంబునకుం జనియె నని యీయభిజ్ఞానంబు మీ కెఱిం గింపు మని పలికి వెండియు న దేవి యి ట్లనియె. నీ, ప్రాణేశ నీ విట్టి యవ విదుండవు సత్త్వవంతుఁడ వాజి సాహసుఁడవు శీలవంతుండవు శిష్ట నమ్ముతుఁడవు దానవులందు నీ దారుణాస్త్ర మేల ప్రయోగింప కి ట్లు పేక్షించితి వమరవిద్యాధరయక్ష సిద్ధ 1505 1507 గరుడ గంధర్వ కిన్నర చారణులలోన నాని నిన్నుఁ దాణి పోరాడఁ జాలి ఆ. నట్టివీరుఁ డొక్కఁ డైన లేఁ కధిప నా, మీఁద నీకుఁ బ్రేమ మిక్కుటముగ ఁ గలదయేని గలనఁ గలుపాత్ముఁ డై నరా, వణునిఁ దునిమి నన్నుఁ బడయు మింక. క. ఘనుఁ డగులక్ష్మణుఁ డయినను, దనయన్నకుఁ బ్రియము గాఁగ దశకంఠు ననిక సునిశిత శరములఁ బొరిగొని, ననుఁ బ్రోవ కుపేక్షఁ జేసినాఁ డోమిటికీన్. తే. అరయదివ్యాస్త్రకోవిదులయ్య వాయు, వహ్నిసను తేజులయ్యు దుర్వార శౌర్యు లయ్యు రాఘవు లేల దళాన్యుఁ దునిమి, నన్నుఁ బ్రోవ కుపేక్షించియున్న వారు. తే. అరయ మద్దుష్కృతంబు కొండంతగలదు, సంశయము లేదు గాని చోశ క్తులయ్యు సహితులయ్యును రామలక్ష్మణులునన్ను, విడిచి యొష్పరికింతు రెప్రియముమఱచి, ప, అని వగపు దోఁపఁ బలికి కన్నీరు నించిన నదేవి సూసయించుచు నేనిట్లంటి. అతడిది. హమమంతుఁడు రామునకుఁ దాను సీత నాశ్వాసించిన ప్రకారము దెల్పుట భూ శా.ళూరుం డైన రఘుప్ర వీరుఁడు భవచ్ఛోకంబుచే వన్య మా హారంబు గొన కన్యకార్యవిముఖుం డై యున్నవాఁ డామహో దారుం గగ్గోని లక్ష్మణుండును బరిత్రస్తాత్ముఁ డై సంతతం బారీతి న్విలపించు చుండు నిజ మీయర్థంబు సాధ్వీమణీ. శ. చిరకాల మయ్యె నెపు డీ, చెఱఁ బాసెదనో యటంచుఁ జింతింపకు మీ దురవస్థ శివుడె యంతము, పరికించెద వింక దుఃఖపడకుము తల్లీ. 1511 1512 తే. అవరో త్తము లిరువురు మానితముగ, నిన్ను వీక్షింపఁగాఁ గోరి యున్నవారు - నిశితశరముల లంకను నీఱుఁజేయఁ, గలకు నిక్కము శోకంబు వలవ డబల, 1518