Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బైనలాంగూలంబు ద్రిప్పుచుఁ బరమానందంబున నుండెఁ బదంపడి జాంబవ
త్ప్రముఖహరిశ్రేష్ఠు లంగదాంజనేయులం బురస్కరించుకొని రామదర్శనకాం
క్షులై సంతోషవిశేషంబునం బొదలుచు గగనంబున నుండి ఋశ్యమూకంబు
నకు డిగ్గి రామసుగ్రీవులసన్నిధిం బొడసూపి రప్పుడు హనుమంతుండు రాముని
చరణంబులు శిరంబు సోఁకం బ్రణమిల్లి బద్ధాంజలిపుటుండై.

1455

హనుమంతుఁడు సీతం జూచితి నని రామునకుఁ జెప్పుట

చ.

జనపతి రాముఁడుం దదనుజన్ముఁడు భానుసుతుండు ప్రీతి సొం
పెనయఁగ సీతవార్త విన నెంతయుఁ గౌతుకముం బ్రియంబు నె
మ్మనమునఁ బర్వఁ దన్ను బహుమానపురస్సరదృష్టిఁ జూడ నే
ర్పునఁ గనుఁగొంటి సీత నని పొల్పుగఁ దెల్పె సుధామయంబుగన్.

1456


తే.

అపుడు సౌమిత్రి సమ్మోదితాంతరంగుఁ
డగుచు నప్పవనాత్మజునందు నిశ్చి
తార్థుఁ డగుభానుసుతునివాక్యమున కలరి
యింపు దళుకొత్త బహుమానదృష్టిఁ గనియె.

1457


క.

పరమప్రీతియుతుం డై, పరవీరఘ్నుండు రామభద్రుఁడు కరుణా
పరికలితకటాక్షంబులఁ, బరికించి బహూకరించెఁ బవనతనూజున్.

1458


వ.

అంత వానరులందఱుఁ జిత్రకాననశోభితం బైనఋశ్యమూకంబు నధిగమించి
యువరాజపురస్సరంబుగాఁ గౌసల్యానందనుపదారవిందంబులకు వందనంబుఁ
జేసి సౌమిత్రిచరణంబులు ఫాలంబు సోఁకం బ్రణతు లై సుగ్రీవునకు నమస్క
రించి వినయవినమితగాత్రులై సంతసంబున.

1459


సీ.

అవనిజ దశకంథరాంతఃపురోచితవనములో నునికియు దనుజయువతు
లుద్వృత్తిమెయిఁ దర్జనోక్తు లాడుటయును రామునిపయి ననురాగ మర్థిఁ
దాల్చుటయును సమస్తంబును వినిపించి సమయకాలము కడసనుట కాత్మ
నలుగక మన్నింపుఁ డని నళీముఖు లెల్ల వేఁడిన జానకీవిభుఁడు మోద


తే.

మంది వారలతోడ ని ట్లనియె సీత
యెచట నున్నది యె ట్లున్న దేమి యన్న
దెలమి నాయందు వర్తించు టెత్తెఱంగు
తెల్లముగ నింతయును మాకుఁ దెలుపుఁ డిపుడు.

1460


వ.

అని పలికిన రామనిగదితం బైనవచనంబు విని వానరు లందఱు సీతావృత్తాంత
కోవిదుం డగుహనుమంతుని నియోగించిన నాహరిశ్రేష్ఠుండు పరమానందపుల
కితగాత్రుం డై భక్తితాత్పర్యంబున సీత యున్నదిక్కునకుం బ్రణమిల్లి రామున
కభిముఖుం డై కేలు మోడ్చి ఫాలంబునం జేర్చి వినయంబున ని ట్లనియె.

1461