842 గోపీనాథ రామాయణము క, రావణునిఁ దునిమి సంగర, కోవిదుఁ డగురాఘవుండె గొని చను నన్ను న్నీ వెంట రాఁ బొసంగదు, ధీవిలసిత ధర్మ సరణి దెలియ నీకున్. చ, అన విని యేను వెండియుఁ వవంసులకుం బ్రణమిల్లి తల్లి చ య్యన నీనుఁ జూచి పచ్చుట యథార్థ మటంచు భవద్విభుండు నే మ్మనమున నమ్మునట్లుగఁ గృప గుఱు తొక్కటి నిమ్మితోడ ని మనవుడు సీత మోడ మురారఁగ న న్బరికించి యిట్లనున్. ఉ. మారుతపుత్ర నీ వసినమాట నిజం బిజ గోము మానికం బారఘువంశ వర్యుఁడు దయానిధి రాముఁడు దీనిఁ జూచి న న్నారని చూచి వచ్చుట యథార్థమ కా మది నమ్మి నిన్ను సొం పార బహూకరించు నని యర్థి నొసంగె శిరోవతంసమున్. 1834 1385 1336 వ. ఇట్లు మణిరత్నం బొసంగి రామైకసంవేద్యం బైన కాకాసుర వృత్తాంతంబును దిలకనిర్ణ యంబు నెఱింగించిన. 1337 క. ఏ నమ్మణిఁ గైకొని య, మానినికిఁ బ్రదక్షిణము నమస్కారంబుక్ మానితభక్తిం జేసి య,నూనవచ ప్రౌఢీ మెఱయ నుతియించి తగన్. తే. గగనమున కుమ్ముఖుండనై కరము వేడ్క నాజ్ఞఁ గొనువాంఛతో నున్న నమ్మహీజ మరల ననుఁ జూచి కార్యంబు తెఱఁగు నడపు పెట్టులగునో యనెడుశంక నిట్టు లనియె. 1338 1389 1340 చ, మఱచెద వేమొ నా తెఱఁగు మానవనాథునితోడఁ జెప్పి స త్వరముగ సూర్యనందనునిఁ దమ్మునిఁ దోడ్కొని వచ్చునట్లుగాఁ దరబడిఁ జెప్పు మవ్విధము దప్పిన రెన్నెల లోర్చి మీఁదట బొరిఁబొరి చేదు ద్రావి మృతి, బొందెద నన్నది యంచుఁ జెప్పుమా. శ. అని దీన యగుచుఁ బలికిన, విని యే న టైల రామవిభుఁ డనుజుఁడు దాఁ జనుదెంచి వేగ రివుఁ బొరి, గొని నినుఁ గొనిపోవు వగపు గొన కుండు మిటన్ ప, అని యూజడలం బలికి య దేవిచేత నామంత్రణంబు వడసి యచ్చోటు వాసి. ఉ. ఆదశకంధరుండు జనకాత్మజ నాడిన క్రూర వాక్యముల్ లోఁ దలపోసి నెమ్మనము ద్రొక్కినకోపము తాల్మి మ్రింగఁగా సాదట జన్య కాంటినయి యంగముఁ బెంచి సమీర వేగిన నాద మెలర్పఁ దద్వనము నష్టముఁ జేసితి దర్ప మేర్పడన్. 1848 వ. ఇట్లు మదీయ భుజాబల విధ్వంసితతరువండమండలం బైనవనంబు నీలోకించి వన పాలకు లగురాక్షసులు దాని చుత్కృత్యంబుగా నెఱింగివికృతముఖులై రయం బుస రావణునిపాలికిం జని. ఉ. దానవలోకపాల విను తాక వీర్య మెఱుంగ కెవ్వఁడో వానరుఁ డేగుదెంచి బలవైభవ మేర్చిన నీవనంబు కా 1344
పుట:గోపీనాథరామాయణము2.pdf/365
స్వరూపం