ను 327 కథునిక్కువంబుగాఁ గ్రాంత యుండఁగఁ బోలు నెంతదురాత్ముఁడ సంతజడుఁడు నెంతదుర్మేధుఁడ నెంత మూర్ఖుఁడ నెంత పాపస్వభావుఁడఁ బతిహితంబు తే. దీర్పలేనైతీ స్వామిఘాూతిమతి నైఁ బూని వచ్చిన కార్యంబు పొందుపఱచు కొనుట గద యు క మెండు తప్పనియె చెఱచి కొ నేడు నాయట్టికష్టదుర్జనుఁడు గబఁడె. 1221 ఆ. అరయ లంకయందు నగ్నిచే భస్మంబు, గాని దేశ యొక్క సేవ లేదు సీత వహ్నిశిఖలఁ జక్కక నుని యున్న, దంచు నిశ్చయింప నగు నెoచంక క. కుపితాత్ముఁడ నై ప్రజ్ఞా, విపర్యయంబున నొకింత వెఱనక మనుజా ధిపు కార్యముఁ జెఱచితి నిఁక్రఁ, గపు లందఱు నన్ను స్వామిఘాతుకుఁ డనరే, నన్వేషణపూర్వక రావణవిలయపరిజ్ఞానసీతా వర్శనసన్ని వేదనరూప మహా కార్యంబు రానునివేకనమాత్రావశిష్టం బగునట్లు గావింపఁబడియెఁ గా వున నిప్పుడు క్రోధాభిభూతుండ నై సనాచేతఁ దత్కార్యమూలక్షయంబు నిస్సం వ మఱియు శయంబుగాఁ గావింపంబడియె రోషంబువలన దోషంబుఁ జేసితి నింక నేమ నిన నేమియగు ముల్లోకంబులయందు మదీయం బైనకపిత్వంబు ప్రథతంబయ్యె రక్షణసమర్థుండ నైననా చేత నాగ్రహంబువలన జానకి రక్షింపంబడ కుండుటం జేసి స్వతంత్రంబు ననవస్థితంబు సగురజో గుణనిబంధన చేష్టాని శేషంబునుగర్హిం చెద రావణుండు సీతం జంపక మ్రుచ్చిలించికొని పోయె నే నద్దేవి నజ్ఞానంబునం జంపితి రామునకు నాకంటే రావణుండె యొక్కింత మేలువాఁ డయ్యె నింక నెత్తె ఱంగున హరీశ్వరుఁ డగుసు శ్రీవుని సందర్శింపంబోదు న రేశ్వరు లగురామ లక్ష్మణులతో నేమని సంభాషింపుడు నకృతార్థుండనై యమ్మహాత్ముల సముఖం బునకుం జనుకంటె నా కిచ్చట జలంబు లంబడి యైనఁ జిచ్చులో నుఱినయైనఁ బాశంబులచే నుఱిగొని యైన విషంబు గ్రోలియైన సముద్రచరంబులగు మహాస త్వంబులకు మదీయశరీరమాంసఖండంబులు సమర్పించియైనఁ బ్రాణత్యాగంబు సేయు టధికోవయంబై తోఁచుచున్నదియచ్చటికింబోయిన సీతావృత్తాంతంబు విని రామలక్ష్మణులు నిక్కంబుగా శరీరత్యాగంబు సేయుదురు తద్వినాశంబుఁ జూచి సుగ్రీవుండు బంధుసహితంబుగా నశించు నంతఁ దద్వృత్తాంతంబు విని భ్రాతృవత్సలుం డగుభరతుండు శత్రుఘ్నసహితంబుగా మరణంబు నొందు ధర్మి ష్టం బగునిష్వాకుకులంబు దీఱిన పిదప సమస్తజనంబులు శోక సంతాపపీడితులె దీఱినపిదప యంతంబు నొందెదరు భాగ్యరహితుండలు ప్రధవార్థసంగ్ర హుండ రోషదోష పరీతాతుండ నగునే నింతకుం గారణంబ నైతి నని యనేక ప్ర కారంబుల దీనుండై చింతించు చుండ నప్పు డయ్యనిలనందనునకు వైదేహి కుశలంబు దెల్పుచుఁ గొన్ని శుభనిమి త్తంబులు దోఁచిన వెండియుఁ దనమనంబున. 1224
పుట:గోపీనాథరామాయణము2.pdf/350
స్వరూపం