సుందరకాండము, 265 తే. పంకజేక్షణ నేత్రాంతపాణిపాద తలసఖములందు రక్రిమ గలిగి యునికి వాసవసమానుఁ డై ననీవల్లభుండు పొందుగఁ ద్రితా మ్రుఁ డన ధాత్రిఁ బొగడు వడసె, తే. తుహినకరముఖ ఘనశిరోరుహవరాంగ ములను మఱియును బాద రేఖలను దనరు చారుసుస్నిగ్ధతావిశేషంబు గలిగి యునికి ద్రిస్నిద్ధ గుఁ డనఁ జాల వినుతి గాంచె. 774 775 776 క. స్వరమును సత్త్వము నాభియు, నురుతరగాంభీర్య మొందియుండుటవలన సరసిజముఖ నీవల్లభుఁ, డరయఁ ద్రిగంభీరుఁ డనఁగ నభినుతి కెక్కెన్. క, ధ్రువముగ ముదరతలంబున, యువతీ కంఠమునఁ ద్రివళు లుండుటవలన దివిజేంద్ర నిభుఁడు రాముఁడు, త్రివళీవంతుఁ డన నభినుతిం గాంచె నిలన్.717 క. వనజాక్షి పాద రేఖలు, ననువుగ సనచూచుకంబు లవనతములు నై తే. దనరారుఁ గాన నీవిభుఁ డనముఁడు త్ర్యవనతుఁ డనంగ నభినుతి కెక్కెన్.. పద్మలోచనకంఠంబు ప్రజననంబు జంఘికలు పృష్ఠ మరియు హ్రస్వంబు లగుట వలన రఘువల్లభుఁడు చతుర్వ్యంగుఁ డనఁగ జగతి లక్షణవిదులచేఁ బొగడు వడయు, క, అరయఁగ నావర్తత్రయ, పరివేష్టిత శీర్షుఁ డగుటఁ బార్థివపుత్రీ, ధర లక్షలజ్ఞు లారము,వగుని నుతింతురు త్రిశీర్ష వంతుం డనుచున్ . తే. పుణ్యసాధ్వి తదంగుష్ఠ మూలమందు శ్రుతిచతుష్టయ సంప్రాప్తి సూచకాభి లలిత రేఖాచతుష్టయం బలరు చున్కి సన్నుతింతురు దగఁ జతుష్కలుఁ డటంచు. తే తామరసనేత్ర తత్పాణితలములందుఁ దగ లలాటంబునందుఁ బాదంబునందుఁ బరఁగ రేఖలు నాలుగు వఱలు చునికి క్షితిఁ జతు రేఖుఁ డనఁగ విశ్రుతి వహించు. 779 780 781 782 వ, మఱియుఁజతుర్వింశక్యంగుష్ఠాత్మ కంబై నహస్తంబు కిష్కు వనం దగునట్టికిష్కు చతుష్టయ ప్రమాణ దేహంబు గలవాఁడు గావునఁ జతుష్కిష్కం డతం డగు నదియునుం గాక. తే, తొడలు మోఁకాళ్లు మఱియు జేతులును బిక్క లరయ నీనాలుగు సమంబు లగుటవలనఁ 788
పుట:గోపీనాథరామాయణము2.pdf/288
స్వరూపం