Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్పరుసున దైత్యబాధలకుఁ బాల్పడి సొక్కుచు నున్న దక్కటా.

416


సీ.

వితతసుఖంబులు విడిచి భర్తృస్నేహబలమున నిడుమలు దలఁప కట్లు
జనశూన్య మగుఘోరవనమున కేతెంచి ఫలమూలముల క్షుత్తుఁ బాసికొనుచు
వేడ్కతో విభుని సేవించుచు నింటిలో నున్నకైవడిఁ బ్రీతి నొందియుండు
నట్టియీకనకాంగి యమ్మహాత్మునిఁ జాసి యొంటి దుఃఖించుచు నున్న దకట


తే.

పూని తష్ణాతురుం డైనమానవుండు, సంభ్రమంబున బానీయశాలనట్లుఁ
శీలసంపన్న యైనయీసీతఁ జూడఁ, గోరి యున్నవాఁ డానృపకుంజరుండు.

417


ఆ.

రాజ్యహీనుఁ డైన రాజు గ్రమ్మఱ ధాత్రి, నొంది సమ్మదంబు నొందినట్లు
రాముఁ డీమృగాక్షిఁ గ్రమ్మఱఁ జేకొని, యనుపమానసౌఖ్య మందఁగలఁడు.

418


తే.

బాంధవులఁ బాసి భోగసంపదలఁ బాసి
రాముఁ డరుదెంచి తన్ను దుర్వారశౌర్య
గరిమఁ గొనిపోవు ననువాస గలిగి మేనఁ
బ్రాణములు దాల్చి యున్న దీపద్మనేత్ర.

419


ఉ.

చూడదు పుష్పభూజములఁ జూడదు రమ్యవిచిత్రశాలలం
జూడదు నిష్కుటావలులఁ జూడదు రమ్యసరోవరంబులం
జూడదు రాక్షసాంగనలఁ జూపుల రామునిదివ్యరూపము
న్బోఁడిమితోడ నెప్పుడుఁ గనుంగొనుచుం దదధీనచిత్త యై.

420


తే.

రమణికి సమస్తమణిభూషణములకంటె
నెక్కు డగుభూషణము విభుఁ డీలతాంగి
ధవునిఁ బాసినకతన నిద్దంపుసొమ్ము
లెన్ని గలిగిన శోభింపకున్న దిపుడు.

421


క.

అనుపమసుఖభోగములకు, ననువుగఁ బాత్ర మగునీనృపాంగన దుఃఖం
బునఁ గుందుచుండఁ గని నా, మనమును గడుదుఃఖశోకమగ్నం బయ్యెన్.

422


ఆ.

రామలక్ష్మణాభిరక్షిత యై సుఖ, లీలఁ జెలఁగునట్టి యీలతాంగి
వికృతరూపదానవీజనాంతరమున, నొప్పు దూలి కుందుచున్న దకట.

423


తే.

హిమకణపరీతనళినిచందమున నష్ట, శోభ యై యప్రధృష్యదుఃఖాభిపీడ్య
మాన యై యొంటి సహచరహీనచక్ర, వాకిగతిఁ గుందుచున్నది వనజనేత్ర.

424


తే.

కాంతు నెడఁ బాసి యిట్లున్నకారణమున, నీసురభికాలహరిణాంకుఁ డీవిశాల
కుసుమితాశోకతరువు లీకువలయాక్షి, కొనర శోకంబుఁ బుట్టించుచున్న విపుడు.

425


వ.

అని పెక్కుతెఱంగుల విచారించుచు సీత యని నిశ్చయించి యల్పగాత్రుండై
యత్తరుశాఖాపర్ణంబులనడుమ నుండి సూచుచుండ నప్పుడు.

426