Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కోద్రవనంబును సప్తవర్ణవనంబులు నన్వేషించి పరిశ్రాంతులై తదీయశిఖరాగ్రం
బునం గూర్చుండి దృష్టిమార్గంబునం బడినసర్వస్థలంబులు వీక్షించుచు రామ
పత్ని నెందుంగానక వెండియు.

1123


క.

చొచ్చినచోటులె చొచ్చుచు, విచ్చలవిడి తిరిగి తిరిగి వేసరి ధరణీ
భృచ్చరు లచ్చట మెచ్చుగ, నెచ్చట జానకిని గాన కెంతయు వగలన్.

1124


క.

బి ట్టలసి గట్టు డిగి యొక, చెట్టుకడం జేరి చాలఁ జింతించుచు నన్
పట్టున ముహూర్తమాత్రము, నిట్ట నిలిచి సేద దేఱి నెమ్మది నంతన్.

1125


ఉ.

వెండియు నంగదాదికపివీరులు వృక్షము వీడి వీఁకతో
నొండొరుఁ జేరఁ బిల్చుకొని యొక్కపదంబును దప్పకుండఁగాఁ
గొండలు కాననంబులు నికుంజము లద్రినితంబభూములున్
మెండుగ మూఁకలై వెదకి మేదినిపుత్త్రిని గాన కెంతయున్.

1126


ఉ.

అందఱు వింధ్యశైలశిఖరాంచితనైరృతకోటిపై నిరా
నందతతోడఁ జేరి విపినంబులఁ బర్వతకూటకోటులం
గ్రందుగ జానకి న్వెదకి కానక వెండియు శోకము న్భయం
బొందఁగ నందుఁ ద్రిమ్మరుచు నుండఁగ మాసము నిండె వారికిన్.

1127


వ.

అంత హనుమంతుండు తనమనంబున.

1128


ఉ.

శైలము లాపగ ల్విషయసంఘము లన్నియుఁ బోలఁ జూచితిం
గాల మతిక్రమించె నృపకన్యక నెందును గాన నైతి నీ
వాలితనూభవాదికపివర్యులు చేడ్పడి యున్నవార లే
లీలఁ జరింతు వీరి మఱిలింతునొ జానకి జాడఁ గాంతునో.

1129


చ.

కళవళ మేటి కీసమయకాలము పోయినఁ బోవ నిమ్మ మ
త్కులపతి యైనసూర్యజుఁడు కోపము చేసినఁ జేయ నిమ్ము పో
సొలయక మేదినీసుతను జూడక పోవుట గాడు యుక్త మ
గ్గలిక సమస్తము న్వెదకి కాంచెదఁ గా కని నిశ్చితాత్ముఁ డై.

1130


వ.

తారాంగదప్రముఖకపివీరులం గూడి దురన్వేషంబును గుహాగహనవంతంబు
నగునప్పర్వతం బెక్కి సింహశార్దూలజుష్టంబు లైనవిషమస్థలంబులందలిశిలా
సంకటంబులును మహాప్రస్రవణంబులందలినదులును శోధించుచుండె నప్పు
డంగదగజగవయగవాక్షగంధమాదనశరభకుముదమైందద్వివిదసుషేణతారనల
జాంబవత్ప్రముఖవానరవీరులు ప్రత్యేకంబుగా నరిగి గిరిజాలావృతంబు లైన
దేశంబు లన్నియుఁ బరిశోధించి యెందును మహీనందనిం గానక యలసి యధిక
క్షుత్పిపాసాపరపతు లై వెండియు నందఱు హనుమత్సమేతంబుగా నొక్కయెడం
గూడికొని సలిలార్థు లై యరుగుచు ముందఱ నతిదుర్గంబును వివృతంబును
మయదానవాభిరక్షితంబును లతాపాదపసంఛన్నంబును మహాద్భుతదర్శనంబును