Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దప్పి గొని సోలినహనుమదాదుల కంగదుఁ డుత్సాహము కలుగఁజేయుట

క.

సోలుచు దుఃఖభరంబునఁ, దూలుచు వదనములు వాడ దోరపుటారిన్
వ్రాలుచుఁ గపివరు లొకతరు, మూలంబునఁ జేరి చింత మునుఁగుచు నుండన్.

1115


వ.

అప్పు డంగదుండు వానరుల నందఱఁ గలయ వీక్షించి మృదువాక్యంబుల మెల్ల
న నాశ్వాసించుచు నిట్లనియె.

1116


చ.

నదులును బర్వతంబులు వనంబులు దుర్గములు న్దరీగుహ
ల్నదములు పట్టణంబులు కొలంకులు పల్లెలు తీరదేశముల్
వెదకితి మిందు నెందుఁ బృథివీసుత గన్పడ దయ్యె రావణుం
డదయత నిమ్మహాగిరిగుహాంతరసీమల నెందు డాఁచెనో.

1117


ఉ.

మాసము నిండ వచ్చె రుచిమాలితనూభవుఁ డుగ్రశాసనుం
డీసునఁ ద్రుంచి వైచుఁ దడ వేటికిఁ దోఁచినయంతవట్టు ధా
త్రీసుత నీగుహాగహనదేశములందు గిరీంద్రకందరా
భ్యాసములందు వేవెదకుఁ డార్తియు శోకముఁ దక్కి ధీరతన్.

1118


తే.

వినుఁడు ధైర్యంబు దాక్ష్యంబు మనసుబలిమి
కర మనిర్వేదమును ధాత్రిఁ కార్యసిద్ధి
కరము లని చెప్పుచుందురు గాన నేను
దడయ కిప్పుడు చెప్పెద దాని మీకు.

1119


చ.

వదలక తా నొనర్చినయవారితకర్మఫలంబు దేహికి
న్సిదిరము గాక తోడుతనె చేకుఱు దానికిఁ జింత యేల మీ
రిది బహుదుర్గఘోరవన మిందు సమస్తదరీముఖంబుల
న్వెదకుఁడు భూమిపుత్రికను వెండియు ఖేదము దక్కి ధీరతన్.

1120


చ.

సమధికశౌర్యు లింద ఱతిసాహసు లద్భుతకర్మశీలు ర
త్యమితబలాఢ్యు లొక్కపనికై రయ మారఁగఁ బూని వచ్చి యే
క్రమమున నైన నప్పని తిరంబుగఁ దీర్పక వెండి పోవ భూ
రమణుఁడు భాజనుండు తనర న్మనలం గృప విశ్వసింతురే.

1121


చ.

అన విని గంధమాదనుఁడు నంగదుఁ డాడినమాట నిక్క మౌ
మన మిటులుండ నేటికి రుమాపతి చెప్పినయట్ల భూమిభృ
ద్వనగిరిదుర్గతాపసవివాససరిత్కటకాపగాదులం
దనుపమభంగి భూమితనయం బరికింతము లెండు చెచ్చెరన్.

1122


వ.

అనిన విని యవ్వానరపుంగవు లందఱు లేచి శీఘ్రంబున వింధ్యకాననసంపూర్ణం
బైనదక్షిణదిగ్భాగం బంతయు వెండియుఁ గలయ వెదకుచుఁ దత్సమీపంబున
నున్నశారదాభ్రప్రతిమంబును శృంగవంతంబును దరీమంతంబును శ్రీమంతంబు
నగురజతపర్వతంబు పొడగని రయంబున నన్నగం బెక్కి యందు రమ్యంబు లగు