Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మఱియు నంబరంబు కాంచనకశలచేతం బోలెఁ జంచలలచేతఁ దాడితం బై
యంతస్స్తనితనిర్ఘోషంబై వేదనాసహితం బైనదానిపోలిక నొప్పుచున్నది
విలోకింపుము.

681


మ.

సరసాగ్రేసరరమ్యచంద్రకరసంస్పర్శప్రభూతప్రమో
దరసోన్మీలితతార యై మిగుల సంధ్యాలక్ష్మి యాత్మీయభా
సురచేతోహరరోహితప్రభలచే సొం పొందఁగా నిప్పు డం
బరముం జాల వెలుంగఁజేసెడి మహాత్మా వేడ్క వీక్షించితే.

682


తే.

అనఘ మేచకమేఘంబు నాశ్రయించి
శంపఁ జూచితె చాలఁ జలించుచున్న
దకట దుష్టాత్ముఁ డైనదశాస్యువంక
తలమునఁ గృశించుచున్నభూతనయఁ బోలి.

683


తే.

అభ్రలిప్త లై నష్టగ్రహాబ్జ లగుట, వలన నజ్ఞాతభాగ లై యలరు దిశలు
మీఱి మదనోత్సవము సేయు వారి కెల్ల, హిత మొనర్చుచు నున్నవి నృపకుమార.

684


చ.

అకలుషచిత్త కంటె విపినాచలసానువులన్ ఘనోదయో
త్సుకకుటజావనీజములు శోకపరీతుఁడ నైననాకుఁ బా
యక మదనప్రదీపనము లై సముదంచితపల్లవంబు లై
వికచసుమంబు లై మదికి వ్రేఁక మొనర్చుచు నున్న వెంతయున్.

685


చ.

రవికులవర్య చూచితివె రమ్యపయోధరకాలసంగతిం
బవనుఁడు శైత్య మొందె నలభానుఁడు మందగభస్తి యయ్యె న
య్యవని రజం బడంగె నదు లన్నియు నిండెఁ బ్రవాసు లైనమా
నవులు స్వదేశభూమికి ఘనంబుగఁ బోవుచునుందు రిత్తఱిన్.

686


క.

ఎడతెగక కురియుదట్టపు, జడివానల మిఱ్ఱుపల్లు సమతలమై కా
లిడ రాక రొంపి గొని యొ, ప్పెడు వనమార్గములు కంటే పృథివీశనుతా.

687


తే.

కంటివె మరాళములు నిజాంగనలఁ గూడి, పరఁగ మానసవాసతత్పరము లగుచు
బహుళవర్షాంబువిక్షతపథములందుఁ, గాలిడక పోవుచున్నవి గగనమందు.

688


తే.

చక్రహంసబకక్రౌంచసారసములు, నష్టకుముదాంబురుహకోకనదము లైన
సరసులం దుండఁజాలక సంభ్రమమున, సొలయుచున్నవి కంటివే జోడువాసి.

689


ఉ.

తక్కక వారివాహనముదంచిత మైనసుపర్వమార్గమున్
మక్కువతోడఁ జూచితివె మానద యొక్కెడ సత్ప్రకాశమై
యొక్కెడ నప్రకాశ మయి యొప్పుచు నున్నది యక్కడక్కడం
జక్కఁగ శైలరుద్ధ మగు శాంతమహార్ణవరూపవైఖరిన్.

690


వ.

మఱియు నర్దకదంబపుష్పవ్యామిశ్రితం బై పర్వతకూటంబులు డిగ్గి తదీయధాతు
రాగతామ్రంబై మయూరకేకారవానున్యూతంబై జలజలనం బఱతెంచునవో