పుట:కేయూరబాహుచరిత్రము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

43

     స్పతిసఖుఁ డన వెలయు దివ, స్పతిచేఁతయు మున్ను బయలుపడియెనకాదే.234
క. పుత్రస్నేహము నట్టి క, ళత్రముపైఁ గూర్మియును దలంపక దానిం
     బాత్రము చేయుము కినుకకు, గోత్రము వోనాటవచ్చుకొఱకే భార్యల్.235
వ. అని యిట్లు పలికి.236
క. ఊరికిఁ బోయెద మేమని, పూరితబాష్పాక్షుఁ డగుచుఁ బోయిన విప్రుం
     డూరక యొకవడి నిలిచి య, గారంబున కేగి లజ్జగదిరినమదితోన్.237
క. దూరగ్రామంబునఁ బని పే, రొక్కటి చెప్పి కపటపేశలమృదుభా
     షారసమునఁ దేల్చి గృహ, ద్వారము వీడుకొని పోయి తగునోలమునన్.238
మ. పగలెల్లన్ వెలి నిల్చి రాతి రరుదౌభంగిన్ స్వగేహంబున
     ట్టుగమీఁదన్ వసియించి భార్యపయి దృష్టుల్ నిల్పియుండంగఁ బ్రొ
     ద్దగుడుం గంజిమడుంగు పేర రజకుం డత్యాస్థ నే తెంచిన
     న్మృగరాజేక్షణ లోచనావరణము న్వేగంబుతోఁ బుచ్చుచున్.239
క. తలుపుం దాన వెసం జని, బలుపుగ నిడి వచ్చి యింటఁ బ్రభు వేవంకన్
     మెలఁగునొ యనియెడు తలఁపున, నలుదిక్కులు చూచి జారనాతుక ప్రీతిన్.240
క. కదియఁ జనుదెంచి కౌఁగిటఁ, గదియఁగ నందంద పేర్చి కామాతుర యై
     సదనములోనికి రమ్మని, తుదచే దిగుచూచువానితో నిట్లనియెన్.241
ఉ. నీకొడు కూర లేఁడు మది నిర్భయ మొందుము వాఁడు గ్రమ్మఱన్
     రాకయు నచ్చటం బదిదినంబులు పోయినఁ గాని లేదు రా
     గాకులచిత్త నైన నను నక్కఫవో రతికేలిఁ దేల్పు ర
     మ్మా కుడువంగ నీకు నని నట్టులు వండినదాన వేఁడిగాన్.242
క. అని భోజ్యంబులు శీఘ్రం, బున నిడి తనయర్ఘ్యసత్యమున నిద్దఱుఁ బొ
     త్తునఁ గుడువఁ జూచి విస్మయ, ఘనలజ్జాక్రోధదుఃఖగతమానసుఁ డై.243
గీ. బ్రాహ్మణుఁడు మందిరాంతరప్రాప్త మైన, యచటి యట్టువ దిగి తనయంగణంబు
     వెడలి యారెకులను దెచ్చి వేగఁ బట్టఁ, బనిచి యిద్దఱ నొప్పించె జనవిభునకు.244
క. ఊరిప్రజ లెల్ల నత్యా, చారం బనఁబరఁగు కులటచరితము లహహా
     యారూఢతఁ జెప్పికొనఁగ, భూరమణుం డర్హదండమున నుగ్రుండై.245
క. ఇరువుర దండించె మహీ, సురుఁడును దనయాలి చెయ్ది సొలయుట భార్యాం
     తరమును బొందఁగ నొల్లక, విరతుం డై యరిగె జాహ్నవికి నతినిష్ఠన్.246
వ. అ ట్లగుటంజేసి.247