పుట:కేయూరబాహుచరిత్రము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

41

గీ. చిఱుతనారటఁగోలె జీవహింస యొనర్ప, దానివ్రతముఁ గాఁగఁ దడవనేల
     జీవహింసఁ జేయుజీవుల సోఁకిన, గాలి సోఁకఁ దలఁతుఁ గల్మషముగ.209
వ. అనుటయు నప్పలుకు లుద్దేశించి యభిజ్ఞుం డనుప్లవంగంబు దనపతి కి ట్లనియె.210
క. అతినిష్ఠ యనాచారం, బతిశౌచ మశౌచభంగి యతినింద యతి
     స్తుతి యివి ధూర్తులవిధము ల, గతి మఱి నైష్ఠ్యంబు దుష్టకపటము దెలియన్.211
వ. అది యె ట్లనిన.212
గీ. ప్రాయమునఁ బెద్దవాఁ డొకబ్రాహ్మణుండు, లక్ష్మణజ్ఞుండు సంగతలక్షణాంగి
     నొక్కకన్నియఁ బెండ్లియై యొరులగోష్ఠి, మరగకుండంగ సఖి నేలమాలెఁ బెట్టి.213
క. పెనుపఁగ నందపెరిఁగి యా, వనితయు యౌవనవిలాసవైభవముం దా
     ల్చిన ఋతుకాలం బన విని, చనుదెంచెను విప్రుఁ డొకనిశాసమయమునన్.214
గీ. వచ్చి యాలి మానవతి నోరకన్నులఁ, జూచి బిట్టబిఱ్ఱుసురతమునకు
     వేగపడిన నచట వెలిఁగెడిదీపంబుఁ, జూపి యిట్టు లనియె సుదతి పతికి.215
క. అనలుఁడు పురుషుఁడు దీపం, బనలుఁడు పరపురుషుఁడైన యనలుని నేఁజూ
     చినఁ దప్ప కాక నన్నతఁ, డనవరతముఁ జూచుచుండ నర్హుండగునే.216
క. కావునఁ దమ ప్రాణేశుల, దీనియ లుండంగఁ గవయు తెఱవలశీలం
     బే వెలితిగఁ దలఁతు ననుచు, దీవియ వెంచి సుఖకేలిఁ దేల్చె నిజేశున్.217
చ. అతఁడును సౌఖ్య మొంది తనయంగన యాడిన సాదుమాట హృ
     ద్గతముగ దాని శీలవతిఁగా మదినమ్మి నిజేచ్ఛ నున్నచో
     గతిపయమాసము ల్చనిన గర్భిణియై యొకనాఁటిరాత్రి యే
     కతమున నాథుతోఁ బ్రసవకాలము డగ్గఱి యుండి ని ట్లనున్.218
ఉ. నా కుదయించుబిడ్డ యిది నాతుక గాక సుతుండయేని న
     స్తోకవివేక యన్యపురుషుం డనఁగాఁబడుఁ గాన వాని నా
     లోకన సేయ నేను బరలోకము వొందెడుఁ బుణ్యభామినీ
     లోకము నాథుఁ దప్ప నవలోకన మొం డొకమర్త్యుఁ జేసినన్.219
గీ. ఇతరపురుషుని విన్నప్పు డేమి చెప్పఁ, జెవులు రెండును బుం డ్లగు జీవితేశ
     నిన్ను వినఁ జూడ వీనులు గన్నుదోయి, కలిగి తక్కినయెడ నవి వలవదందు.220
మ. అని తత్సన్నిధి నేత్రపట్టము దృఢం బై యుండ నయ్యింతి తా
     ల్చిన నాథుండును నమ్మి భూగృహనివాసిత్వంబున న్మాన్చి యా
     త్మనివాసంబున నిడ్డఁ బుత్రవతి యై తత్పుత్రు నెన్నండుఁ జూ