పుట:కేయూరబాహుచరిత్రము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

39

క. తన దేహము నిత్యంబే, తనధన మది సెప్పనేల తాను దనధనం
     బును దైవధనంబులు తన, ధనము లతఁడు పఱచినట్టు తగదే పడఁగన్.186
క. చెలితనమునఁ దనుఁ జెఱచిన, తులువం గని తొలఁగిపోక తోరపుఁ బ్రియముల్
     పలుకులతీపులుఁ జూపుచుఁ, జెలియై వర్తించి గాక చెఱపఁగ నగునే.187
క. అని నిశ్చయించి యాతని, తనయెడ నొకవెఱపులేనిదట్టపునెయ్యం
     బొనర నటియించి యొక నాఁ, డనురాగియపోలె నతనియాత్మోద్భవుతోన్.188
క. లాలనము సేయుచుం దన, యాలయమున కెత్తికొని రయంబునఁ జని యే
     కీలున నెవ్వరు నెఱుఁగం, జాలనియెడ డాఁచి దుఃఖిచాడ్పున నుండెన్.189
ఉ. కొండొకసేపులోన ధనగుప్తునివారలు వచ్చి పాపనిం
     దెం డని పల్కినన్ వగచి తెక్కలిగృధ్ర మొకండు నాదుచే
     నుండఁగ బిడ్డ నెత్తుకొని యుగ్రతఁ బోయిన నేమి చెప్పుదు
     న్నిండినతీవ్రదు:ఖ మనునీట మునింగినవాఁడువోలె నై.190
ఉ. సెట్టికిఁ జెప్ప రా నచటఁ జేరఁగ నోడెద నన్నఁ బోయి యా
     పట్టివిధంబు వా రతనిపల్కినయట్లన చెప్పినం బులిం
     గొట్టినమాడ్కి నల్గి ధనగుప్తుఁడు లోకములోన నెన్నఁడే
     నిట్టివి వింటిరే యని మహీంద్రున కవ్విధ మెల్లఁ జెప్పినన్.181
గీ. వర్ధమానుని రప్పించి వసుమతీశుఁ, డింత నెఱమానిసివి బొంక నిట్లు తగునె
     బాలకుని గ్రద్ద యెత్తుక పాఱె ననుట, యేయుగంబుల నెచ్చట నేని గలదె.182
వ. అనిన వర్ధమానుఁడు ముకుళితకరకమలుం డై యిట్లు విన్నవించె.193
ఉ. దేవర పొందుగా నిది నుడిం బరికించితి రిట్లు సర్వమున్
     భావములో నెఱుంగఁ దగు నావలరెంటియయంబు నెల్కలీ
     భూవలయంబునం దినుట పోలగునే యిది సెట్టి సెప్పెడున్
     నావెఁడు మధ్ధనంబుఁ గొని నా కిడనొల్లక శాఠ్యబుద్ధి యై.194
క. ఆనుటయు జనపతి యిది యె, ట్లని యా ధనగుప్తుఁ జూచి యడిగిన నతఁ డీ
     తనిపొత్తునఁ జినమునకై, యిను మోడల రెంటఁ గొంచు నేగితి నధిపా.195
క. కొనిపోయిన యిను మంతయుఁ, దన దగు భాగ్యమున నెలుకతండము భక్షిం
     చిన నాయినుమోడెంటికిఁ, గనకం బోడెఁ డని నన్నుఁ గల్లలె నడపెన్.196
వ. అనిన వర్ధమానుం డప్పలుకులు దెలియ నవధరింపుం డని రాజు నుద్దేశించి.197
క. రెండోడలినుము మూషిక, కాండము భక్షించె ననుట కల్లపలుకు గా