పుట:కేయూరబాహుచరిత్రము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

29

     గడునంబాఱెద నిన్ను నేను మిగులంగాఁ జాలినట్లైన నె
     న్నఁడు భక్షింపకు మమ్ము నోడినటులైనన్ మాకులం బెల్ల నె
     ప్పుడు నాహారము గొమ్ము నీవు వినతాపుత్రా మహాధార్మికా.58
వ. ఇవ్విధంబు సేయం దలంపు గలిగెనేని నొక్కనాఁ డిచటికి విజయం చేయుం డనిన
     సుపర్ణుం డట్లు చేయుదు నని యొడంబడి పోయిన.59
క. తనచుట్టంబుల నందఱి, ననువుగ నొకచోటఁ గూర్చి యాకూర్మము తా
     ర్క్ష్యునితోఁ దా నొడఁబడి వ, చ్చినచందము వారితోడఁ జెప్పుడు వారున్.60
క. నినుఁ గడచినమతిమంతులు, మనలోపలఁ గలరె పంపు మము నైపని యై
     నను జేయుదు మనవుడు నది, మనమలరఁగఁ జెపుదు వినుఁడు మన మంచఱమున్.61
క. ఆమఱి యెడఁ బదిపదిగా, సాముద్రతటంబునీరఁ జని యుండి ఖగ
     స్వామి పఱవంగ నాతని, కాముందటివాఁడు చూపునది పొడ వచటన్.62
వ. అని యోజచేసికొని విహగవల్లభుతోడఁ దాను మాటలాడినయెడన యాకచ్ఛపం
     బు నిలిచె నచ్చటు మొదలుకొని యనేక యోజనంబులు దాఁకఁ దక్కినవియు న
     ట్ల యుండ మఱునాఁడు సనుదెంచి.63
క. గరుడుం డవ్వలనికి స, త్వరగఁ గూర్మంబుఁ బిలిచి వారిధిపై నం
     బరవీథిఁ బెద్దయునుద, వ్వరుగుచు నది చిక్కనోపు నని చీరుటయున్.64
క. ఓ యని పలుకుచు ముందఱఁ, దోయధిలోఁ గచ్ఛపంబు దోఁచిన మఱియున్
     వాయుగతిఁ బఱచి చీరిన, నాయెడ నగ్రమునఁ గమఠ మల్లన నెగసెన్.65
వ. అవ్విధంబుఁ గని యచ్చెరు వొందుచు.66
క. అందుండి మగుడఁ బఱచుచు, ముండటి యట్లట్ల పిలువ ముందఱ నంతం
     తం దోఁచుచు నవి పిఱుఁదులు, ముందఱఁగాఁ జేసి పక్షిముఖ్యునిఁ గెలిచెన్.67
క. అతఁడు తనయోటమిని ల, జ్జితుఁ డై మీ కెందు నెగ్గు సేయం బ్రమద
     స్థితి నిలువుఁ డనుచుఁ బోయిన, నతిసంతోషమునఁ గచ్ఛపావళి యుండెన్.68
వ. అట్లగుటఁ బరస్పరవశ్యు లగుబంధువు లాపద గడవవచ్చు నింక నైన మదీయవచ
     నంబు లంగీకరించెదరేని వినుం డని మతిమంతుం డి ట్లనియె.69
సీ. కంఠమూలంబునఁ గదిసినయీయురు లూడిచికొని పోవు యుక్తి లేదు
     గాని చావక యుండఁ గల దుపాయం బైకమత్యంబు గలిగిన మనకు నెల్ల
     నె ట్లన్న నిజ్జాల మొడ్డినవేఁటకాఁ డేతెంచు నిందుకు వేగఁ దడయ
     కప్పుడు మన మెల్ల నవగతప్రాణులకరణి నుండినఁ జాలు నురులఁ బాపి