పుట:కేయూరబాహుచరిత్రము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

21

     ళ్ళెండఁగఁ గాళ్ళుఁ దొట్రువడ నేదెసఁ బాఱఁగలేక కూయవే
     దండము సేరి కొమ్ములఁ బదంబులఁ దొండమునన్ వధించినం
     దండము లయ్యెఁ బీనుఁగులు ధారుణిఁ గాలువ లయ్యె నెత్తురుల్.104
గీ. అట్లు జైనుల వధియించి యచటఁ గడమ, వడినవసతులు వడద్రోచి వారణంబు
     కొలను సొచ్చి సరోరుహకులను నెల్ల, మరల భగ్నముఁ గావించి దరికి వచ్చి.105
క. సరసీజలముల నిండం, గరమునఁ బూరించి యోరఁగాఁ బడి చెవిలో
     గురిపించినఁ దల్లడపడి, సరటము బైటఁబడెఁ గరియు సమ్మద మందెన్.106
గీ. అల్సు లొనరించు దుష్కలహంబుఁ గూడ,
     జేరు వైయున్న ఘనులకుఁ జేటుఁ దెచ్చు
     సరటకలహంబు చేరువై సమసినట్టి
     వారణము జైనకులముఁ గాసారమట్లు.107
వ. అని మకరందిక యెఱింగించినఁ గడుఁ గొనియాడి సుకుమారిక యిట్లనియె.108
క. ఆలుకయు మదమును గర్వము, నొలుకు నకారణవిరోధ మొందు జనులచె
     య్వుల కెక్కుడైన యాపద, మొలచును మధుబిందుకలహముల చందమునన్.109
క. ధరణిపయి లాటనరపతి, పురిఁ దేనియ నమ్ముకొఱకు బోయలపల్లెం
     జరియించుచుండువాఁ డొక, పురుషుం డది యొక్కకలశమునఁ గొని కడఁకన్.110
వ. అరిగి యానగరంబున నొకసన్నపువీథియందు.111
ఉ. తేనియకుండ మ్రోచికొని దిక్కులు నాలుగు బిక్కచూడ్కి నే
     దేనియుఁ జూచుకొంచు నొకయేనిక కట్టెదుటన్ మదాంధమై
     రా నచటం దొల గెడు పురంబుజనంబును జూచి భీతుఁ డై
     దానును నుత్తరించుచుఁ బదంబులు తొట్రుపడంగఁ బాఱుచున్.112
గీ. వడఁకుఁ గొని నిలవఁద్రొక్కని యడుగు కొంత
     జాతి మొగ్గతిలంబడం బాఱుటయును
     నిండి మూఁపునఁ దాల్చిన కుండ తొలఁకి
     యొలికె మధుబిందు వొకకొంత యుర్విమీఁద.113
సీ. ఆ తేనెబొట్టున కచట నీఁగలు ముసిరిన వానిఁ బట్టంగ నని కడంకఁ
     జేరె నచ్చటి కొక్కచెలఁది, యాచెలఁది మ్రింగిన బల్లి నొకపిల్లి దినియె, నంత
     నాపిల్లిఁ గఱచె రాజాధీన మగు వేఁటకుక్క యొక్కటి, దానిఁ గోప మడరఁ
     బొడిచె బిడాలంబు, గొడయని నగరికుక్కలవారు చంపిరి కడఁగి దాని