పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxx

కృష్ణమూర్తి తత్వం

భాగమే. లేత గడ్డిపోచల్లో వున్నది నా అస్తిత్వమే. ఆ మనిషి పక్కనే వున్న చెట్టే నేను. ఆ రోడ్డు బాగుచేస్తున్న మనిషివీ నావీ మనోభావాలు, ఆలోచనలూ దాదాపుగా ఒక్కటిగా వున్నాయి. చెట్టు మధ్యలో నుండి గాలి వీచడం నన్ను స్పృశిస్తున్నట్లే వుంది. గడ్డిపోచ మీద చీమ పాకడం నేను అనుభూతి చెందు తున్నాను. పక్షులు, ధూళి, ఆ సందడీ అంతా నాలో భాగంగా అనిపిస్తున్నది... నేను ప్రతిదాంట్లోనూ వున్నాను; అది కాదు, నాలోనే ప్రతిదీ వున్నది. ప్రాణరహితమైనవి, ప్రాణం వున్నవీ, పర్వతమూ, చిన్న పురుగూ, గాలి పీల్చే అన్ని ప్రాణులూ నాలోనే వున్నాయి.

ఈ వాక్యాలు 'అక్కడ వున్నదాని'తో అన్యోన్యత చెంది, కరిగిపోయిన ఒక వ్యక్తిత్వాన్ని వర్ణిస్తున్నాయి. కర్త, కర్మ {ద్రష్ట, వస్తువు} కలిసిపోయిన ఒక గాఢమైన సహానుభూతీ కృష్ణమూర్తి సహాజ స్వభావంలో మొదటి నుంచీ స్థిరంగా వుంటూ వచ్చింది. బాల్యంలో అతనిలో కనబడిన 'ఖాళీతనం' లో దీనిని స్పష్టంగా చూడవచ్చు. అతనిలో సహజసిద్ధంగా వచ్చిన యీ సహానుభూతికీ, దాని సంపూర్ణమైన అభివ్యక్తీకరణ అయిన 'నీవే ప్రపంచం' అనే ప్రవచనానికీ మధ్యన పరిపక్వమైన కృష్ణమూర్తి అంతర్దృష్టి వున్నది. తనలో గాఢంగా, స్థిరంగా వున్న సహానుభూతి సాధారణ మానవుని చేతనావర్తంలో కూడా ఎందుకని ఒక ప్రధానభాగంగా లేదో కృష్ణమూర్తి నేర్చుకోవలసి వచ్చింది. ఈ వాస్తవానికి తగిన ఒక సమాధానాన్ని అతడు కనిపెట్టవలసి వచ్చింది. కృష్ణమూర్తి లేఖలో యింకా యీ విధంగా సమస్తాన్నీ ఆవరించుకొని వున్న ఆ ప్రశాంతతను గురించిన వర్ణన వుంది.

"నా లోపల ఒక లోతైన, అగాధమైన కొలనుకు అట్టడుగున వుండే నెమ్మది వున్నది. ఆ కొలనులాగే నా దేహాన్నీ, నా మనసునీ, అందులోని వుద్వేగాలనూ వుపరితలం మీద అలలు అలలుగా కదిలించవచ్చును గానీ, నా ఆత్మలోని నెమ్మదిని మాత్రం ఏదీ- అవును, ఏదీ అలజడి చేసి చెరపలేదు."

శ్రీమతి బెసెంటు నిరీక్షణకూ, పెట్టుకున్న ఆశలకూ తగినట్లుగా జీవిస్తున్నాననే నమ్మిక అతనిలో పెరుగుతున్నట్లు సూచనలు కనబడతాయి.

"నేను కాంతిని దర్శించాను. దుఃఖాన్ని, బాధను నయంచేసి వేసే కారుణ్యాన్ని నేను అందుకున్నాను. ఆ కారుణ్యం నా కోసం కాదు, యీ ప్రపంచం కోసం... ఇక మళ్ళీ ఎన్నడూ అంధకారం నన్ను తాకలేదు, మహాద్భుతమైన, స్వాస్థ్యగుణం కల కాంతిని నేను దర్శించాను... ఆనందమూ, అనంత సౌందర్యమూ అనే స్రవంతిలో నేను ఓలలాడాను. దైవత్వం నన్ను పరవశత్వంలో ముంచి వేసింది."