పుట:కాశీఖండము.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

495


నిది కాశికాఖండ మిమ్మహాఖండంబు
        శ్రీమహాస్కాందవార్థికి నమృతము
పఠియించినను దీనిఁ బ్రతిలిఖించిన విన్న
        దానంబు చేసిన దారులోహ
పాషాణపీఠికోపరిభాగమున నిల్పి
        గంధపుష్పముల నక్షతలఁ బూజ


తే.

సేసినను గాశికాభర్త శివుఁడు విశ్వ
నాయకుఁడు లక్ష్మి యిచ్చు దీర్ఘాయు వొసఁగుఁ
బ్రాభవంబుఁ బ్రసాదించు భక్తతతికి
శ్రీవిశాలాక్షి కృప సేయుఁ జింతితములు.

264


ఆశ్వాసాంతము

శా.

కర్ణాటక్షితీపాలమౌక్తికసభాగారాంతరాకల్పిత
స్వర్ణస్నానగతిప్రసిద్ధకవిరాట్సంస్తుత్యచారిత్ర! దు
గ్ధార్ణోరాశిగభీర! ప్రాహ్ణముఖమధ్యాహ్నాపరాహ్ణార్చితా
పర్ణావల్లభ! రాజశేఖరమణీ! పంటాన్వయగ్రామణీ!

265


క.

హేమాద్రిధీర! ద్రాక్షా
రామశ్రీభీమశంకరకృపాలక్ష్మీ
సామగ్రీపరివర్ధిత
భూమాసామ్రాజ్యవిభవ! పుణ్యశ్లోకా!

266


మాలిని.

వికచకములనేత్రా! నేమమాంబాసుపుత్రా!
సకలనృపశరణ్యా! సంభృతాశేషపుణ్యా!
మకరనిధిగభీరా! మానినీచిత్తచోరా!
ప్రకటగుణతరంగా! రాయవేశ్యాభుజంగా!

267