పుట:కాశీఖండము.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

494

శ్రీకాశీఖండము


తే.

కుంభసంభవుఁ డంబికాసంభవునకు
బ్రణతుఁడై దేవతాయాత్రపదము దెలుపు
క్రమముతో నది మొదలుగాఁ గాశియందుఁ
దీర్థ మాడంగ నర్హంబు దివిజవంద్య!

262


దేవతాయాత్రావిధానము

వ.

అనినం గుమారస్వామి చక్రపుష్కరిణీతీర్ణంబున దేవర్షి పితృతర్పణంబు సేసి యాదిత్యాద్రౌపదీవిష్ణుదండపాణిమహేశ్వరడుంఠివినాయకజ్ఞానవాపీనందికేశ్వరతారకేశ్వరకాలేశ్వరుల సేవించి విష్ణువిశ్వేశ్వరుల నారాధించునది. అనంతరంబ ఓంకారలింగంబు
మత్స్యోదరీకృత్తివాసోలింగంబు రత్నేశ్వరుండు చంద్రేశ్వర కేదారేశ్వర కరవీరేశ్వర దక్షేశ్వర పార్వతీశ్వర పశుపతీశ్వర గంగేశ్వర నర్మదేశ్వర గభస్తీశ్వర సరస్వతీశ్వర తారకేశ్వరుల దర్శించునది. శైలేశ్వర సంగమేశ్వర మందాకినీశ్వర మణికర్ణికేశ్వర గోప్రేక్షేశ్వర కాపిలేశ్వర శుక్రేశ్వరేశ్వర వహ్నీశ్వర నకులేశ్వర భారభూతేశ్వర లాంగలీశ్వర మ(౦)దాలసేశ్వర తిలపర్ణేశ్వర త్రిపురాంతకేశ్వర మనఃప్రకారేశ్వర ప్రీతికేశ్వర బ్రహేశ్వ రాగస్తీశ్వర కశ్యపేశ్వర త్రిసంధేశ్వర హాటకేశ్వర సీమావినాయకత్రిసంధ్యేశ్వర విశాలాక్షీశ్వర రమేశ్వర ధర్మేశ్వర వినాయక వృద్ధాదిత్య చండిచండీశ్వర భవానీశ్వర పరాన్నేశ్వర వీరభద్రేశ్వర పంచవినాయకులం బూజించునది.

263


సీ.

యాత్రాక్రమం బిది యానందకానన
        వాస్తవ్యదేవతావర్గమునకు