పుట:కాశీఖండము.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

493


నాకు నిది ప్రాప్త మని మహానందుఁ డుండు
మస్తకము వాంచి కాంతారమధ్యభూమి.

258


చ.

తలలు దెగంగ వేయుదురు తస్కరవీరులు వారి నల్వురన్
నలువురుఁ జచ్చి యన్యజననంబునఁ గుక్కుటజాతిఁ బుట్టుటం
గొలఁకులకోళ్లలోఁ గలసి కోళ్లును నాలుగు నుండుఁగాన య
ప్పులుఁగుల గూటఁ బెట్టుకొనిపోదురు కాశికి సార్థవాహకుల్.

259


సీ.

రేపాడి మణికర్ణికాపయోవేణిక
        మజ్జనం బాడు నేమంబు మెఱయ
ముక్తిమంటపములో మునిజనంబు పఠింప
        విను నాదిమపురాణవిస్తరంబు
విశ్వనాథునిదివ్యవేశ్మంబునకు జేయు
        మైత్రి మీఁదఁ బ్రదక్షిణత్రయంబు
ద్వారభూములఁ జల్లు నీరాజనక్రియా
        దివ్యాన్నములఁ దీర్చు దేహయాత్ర


తే.

గోరి భజియించు నొకవేళఁ గొమరుసామిఁ
నాల్గుజాలును సంజ్ఞాస్వనం బొనర్చు
బ్రణవమంత్రంబు క్రేంకారపదముఁ గూర్చు
మిక్కుటం బగుగరిమతోఁ గుక్కుటములు.

260


వ.

ప్రాగ్జన్మవాసనావశంబున నజ్ఞానతస్కరత్వంబు గలిగి యాకుక్కుటచతుష్కంబు ముక్తిమంటపంబు నాశ్రయించి మోక్షంబు వడయం గావున నమ్మంటపంబునకుఁ గుక్కుటమంటపంబను సంజ్ఞాంతరంబు సంభవించు నని శంభుండు విశ్వంభరునకు నావృత్తాంతం బానతిచ్చె. విశ్వంభరుండును విశ్వేశ్వరలింగంబుతోడి సాంగత్యంబు వహించె నని చెప్పుటయు.

261