పుట:కాశీఖండము.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

492

శ్రీకాశీఖండము


నలుగురం బట్టి ధన మెల్ల నొనిచికొండ్రు!

252


వ.

ఒలిచికొని యాదొంగ లిట్లని వితర్కింతురు.

253


తే.

ధనము హేరాళ మబ్బె నీతఁడు బళాయి
వీడు ప్రాణాన కలిగిన వెదకి వెదకి
మనల బరి మార్చుఁ గా కేల మనఁగ నిచ్చు
నితని వధియింత మని నిశ్చయింతు రపుడు.

254


వ.

వధియింప నిశ్చయించి బ్రాహ్మణునిం జేరి కత్తిఁ దీటి యోయి విప్రుండ; నీవు కళత్రంబును నీతనయులును మీయిష్టదైవంబులం దలంచికొం డనుటయు.

255


తే.

అంబురుహనేత్ర శ్రీవిశాలాక్షిఁ దలఁచు
బ్రాహ్మణుఁడు చిత్తమున విశ్వభర్తఁ దలఁచుఁ
దలఁచుఁ బుత్రద్వయంబు సద్భక్తియుక్తి
గంఠపీఠాగ్రకరిరాజు డుంఠిరాజు.

256


వ.

వెండియు మహానందుం డాత్మగతంబున.

257


సీ.

పొరిగింటిబ్రాహ్మణిఁ బుణ్యగేహిని నేల
        యపహరించితిఁ గన్ను లార్చి యార్చి?
పడరానిబ్రాహ్మణపదవి భస్మంబుగా
        మధుమాంసముల కేల మరులుగొంటిఁ?
బరమనాస్తికుఁడ నై పాషండవేషంబు
        ఘటియించుకొని యేల కోర్కి నైతిఁ?
జక్రపుష్కరిణిలోఁ జండాలకుజుచే
        ధన మపారం బేల ధార గొంటి?


తే.

నాతతాయికి శఠున కన్యాయరతికిఁ
బాపబుద్ధికి విశ్వాసపాతకునకు