పుట:కాశీఖండము.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

475


తే.

ఆరగించెఁ జతుర్విధాహారములను
మనసుకోరిక నిండంగ మునిగణంబు
వారిబంతిన కుడిచె నావాసభర్త
ధర్మగేహిని తాలవృంతంబు వీవ.

189


వ.

భోజనానంతరంబున నాస్థానమంటపంబున సుఖోపవిష్టుండై ధర్మపత్నియుం దాను గృహపతి బాదరాయణు రావించి కూర్చుండ నియమించి కనుసన్నఁ జేసి విశాలాక్షికి నతనితో నాడంగలమాట లాడుమనిన నమ్మహాదేవి సాత్యవతేయున కిట్లనియె.

190


తే.

ఆరగించితె కడుపు నిండార నీవు?
శిష్యతతి భోజనంబు సేసెనె యథేచ్ఛ?
నదను దప్పినఁ దలఁగి యంతంత సున్న
వారు లేరు గదయ్య మీవంగడమున?

191


వ.

అనిన బాదరాయణుండు మహాదేవీ! షడ్రసంబులయందు నొక్కొక్కరసం బుల్బణంబును, ననుల్బణంబునుఁ, నుల్బణానుల్బణంబును ననుమూఁడుప్రకారంబుల ముయ్యాఱుభేదంబుల నాస్వాదనీయంబులై చతుర్విధాహారంబులయందు మాజిహ్వలకుం బండువు నేసె. కడుపునిండ భుజించితిమి. వాసరద్వయోపవాససం(ప్ర)భూతజఠరగోళక్షుధాగ్నితాపం బుపశమించె. అవసరంబు దప్పి భోజనంబు లేక యంతంత నున్నవారు మాయం దెవ్వరును లేరు. మున్నెన్నడుం జూడము వినము. ఇట్టియద్భుతంబుం గలదె! పాత్రంబులయందు విచిత్రంబు లగునన్నంబులు సవ్యంజనంబులయి తమకుందా మావిర్భవించు టెట్లు? మీ