సప్తమాశ్వాసము
475
తే. | ఆరగించెఁ జతుర్విధాహారములను | 189 |
వ. | భోజనానంతరంబున నాస్థానమంటపంబున సుఖోపవిష్టుండై ధర్మపత్నియుం దాను గృహపతి బాదరాయణు రావించి కూర్చుండ నియమించి కనుసన్నఁ జేసి విశాలాక్షికి నతనితో నాడంగలమాట లాడుమనిన నమ్మహాదేవి సాత్యవతేయున కిట్లనియె. | 190 |
తే. | ఆరగించితె కడుపు నిండార నీవు? | 191 |
వ. | అనిన బాదరాయణుండు మహాదేవీ! షడ్రసంబులయందు నొక్కొక్కరసం బుల్బణంబును, ననుల్బణంబునుఁ, నుల్బణానుల్బణంబును ననుమూఁడుప్రకారంబుల ముయ్యాఱుభేదంబుల నాస్వాదనీయంబులై చతుర్విధాహారంబులయందు మాజిహ్వలకుం బండువు నేసె. కడుపునిండ భుజించితిమి. వాసరద్వయోపవాససం(ప్ర)భూతజఠరగోళక్షుధాగ్నితాపం బుపశమించె. అవసరంబు దప్పి భోజనంబు లేక యంతంత నున్నవారు మాయం దెవ్వరును లేరు. మున్నెన్నడుం జూడము వినము. ఇట్టియద్భుతంబుం గలదె! పాత్రంబులయందు విచిత్రంబు లగునన్నంబులు సవ్యంజనంబులయి తమకుందా మావిర్భవించు టెట్లు? మీ | |