472
శ్రీకాశీఖండము
| థుని కృపపేర్మి నెంద ఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం | 183 |
వ. | అనిన నట్లకాక మహాప్రసాదం బని వేదవ్యాసుండు శిష్యులం గూర్చుకొని భాగీరథికిం జని యుపస్చర్శం బాచరించి యేతెంచిన. | 184 |
తే. | గొడుగు పాగలు గిలుకలు గులుకరింప | 185 |
వ. | అనంతరం బావిశాలాక్షీ మహాదేవి యనుభావంబున నమ్మహామునులముందటం గనకరంభాపలాశపాత్రంబులయందు విచిత్రంబుగాఁ గలవంటకంబులు, నపూపంబులు, లడ్డుకంబులు, నిడ్డేనలు, గుడుములు, నప్పడంబులు, నిప్పట్లు, గొల్లెడలు, దోసియలు, సేవియలు, [1]నంగరపొలియలు, పోవెలు, [2]సారసత్తలు, [3]బొత్తరలు, జక్కిలంబులు, మణుఁగుఁబూవులు, మోరుండలుఁ, బుండ్రేక్షుఖండంబులు, బిండఖర్జూరద్రాక్షానారికేళకదళీపనసజంబూచూతలికుచదాడిమీకపిత్తకర్కంధూఫలంబులు, గసగసలుఁ, బెసరుపులగములుఁ, జెఱకుగుడుములు, నరిసెలుఁ, బిసకిసలయములవరుగులుఁ, జిఱుగడములుఁ, బడిదెములుఁ, బులుపలుఁ, బులివరుగులు, నప్పడంబులు , బప్పు(లు), రొట్టియలును, జాపట్లు, బాయసంబులుఁ, గర్కరీకారవేల్లకూశ్మాండ నిష్పావకపటోలికాకోశాతక్యలాబూ | |