పుట:కాశీఖండము.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

449


సీ.

తనమీఁద వైవంగ దంభోళి యెత్తిన
        జెలఁగి సంస్తంభించె జిష్ణుభుజము
కైటభారాతి చక్రము ప్రయోగించిన
        వెసఁ జక్కిలముఁ బోలె విఱిచి బొక్కెఁ
బటుచపేటంబునఁ బండ్లు డుల్లఁగ మొత్తి
        పూషార్కువదనంబు బోసిపుచ్చెఁ
జప్పముత్తెములు రాల్చినభంగి నలవోక
        భగునిగ్రు డ్రదరంగ బలిమిఁ దన్నె


తే.

నర్ధచంద్రబాణంబున యజ్ఞమృగము
శిరముఁ దెగనేసి కట్టె నంబరముమీఁద
ధాతపతిముక్కు సోణంబు దాఁకఁ గోసెఁ
బ్రకటవిస్ఫూర్తి శ్రీవీరభద్రమూర్తి.

85


తే.

ద్రోహు లగు వేలుపులలోన దొరలి యున్న
పదియునొక్కండ్రురుద్రులఁ బాఱ విడిచె
గాసి చేయక కాకోలకంఠుపట్టి
తండ్రిపేరివా రగుట చిత్తమునఁ దలఁచి.

86


వ.

అంతట.

87


క.

సిగ్గు చెడి భీతిఁ బాఱిరి
బగ్గనఁ బోధించి వీరభద్రునిధాటిన్
నుగ్గు లయి యవురుసవు రయి
గగ్గులకాండ్రై వికావిక లయి యమర్త్యుల్.

88


తే.

దక్షునల్లుండ్ర మెడల సూత్రములఁ గట్టి
యూపములు సూత్రములతోడ సుద్ది చేసి