పుట:కాశీఖండము.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

443


రఖలభూషణభూషితాంగు లగుచుఁ
దనరూపునకుఁ దోడు దలము దప్పినగర్వ
మరకంటఁ జూడఁ డే నరిగినపుడు
నాపెండ్లికొడుకులం దేపాటివాఁడు తా?
నేల రప్పింతు నే నిట్టివాని?


తే.

నీవు వచ్చితి మే లయ్యె నింతెచాలు
నతఁడు రాకున్నఁ గొదువలే దంశమైనఁ
దాను బిక్షాకపాలంబు దాల్చి వచ్చి
బండు సేయుటకంటె రాకుండు టొప్పు.

70


వ.

అనిన విని సతీదేవి తండ్రి కి ట్లనియె.

71


శా.

ఆహా! లెస్స! వివేకమే! పురహరుం డాసించియున్నాఁడె నీ
స్వాహాకారము? శంభుఁ బాసి యిట నీసత్రంబునం దేను మృ
ష్టాహారంబు భుజింపవచ్చితినె మోహాంధుండ వై యీశ్వర
ద్రోహం బేటికిఁ జేసెదంచు హితబుద్ధుల్ చెప్పఁగా వచ్చితిన్.

72


తే.

శివుఁడు దాత భోక్త శ్రీమహాదేవుండు
సర్వమును హరుండు శాశ్వతుండు
శంభు వేఱు నేసి సాగింపు వచ్చునే
క్రియలు? వెఱ్ఱి బేల వయితి? చెపుమ.

73


దండకము.

మఱి యతఁడు, సదానిధిధ్యాసితవ్యుండు మంతవ్యుఁ డాతండు శ్రోతవ్యుఁ డాతండు ద్రష్టవ్యుఁ డాతండు జన్మస్థితిధ్వంసనముల్ తిరోభావమోక్షంబులున్ గృత్యముల్గాఁగ నాతండు లోకంబులం బట్టి పాలార్పు రుద్రుండు విశ్వాధికుం డంచు నామ్నాయసంఘాత మామ్రేడనప్రక్రియం దోరమై యాతనిం జెప్పు సత్యంబు నిత్యంబు శుద్ధంబు బుదం