442
శ్రీకాశీఖండము
| దర్భహీనం బైనసంధ్యాదికృత్యంబును, జలహీనం బైనపైతృకంబును, హవిర్హీనం బైనహోమంబును, శివహీనం బైనక్రియాకలాపంబులు నిరర్థకంబులు. | 65 |
తే. | అనినఁ గోపించి దక్షుఁ డీయవనిసురుని | 66 |
వ. | అతనితోడ దుర్వాసుండు, నుదంకుండు, నుపమన్యుండును, రుచికుండును, గాలవుండును, మాండవ్యుండును, వామదేవుండును, నుద్దాలకుండును వెడలిరి. అంతకమున్న మీఁ దెఱింగి బ్రహ్మ సత్యలోకంబునకుం జనియె. మఖంబు ప్రారంభింపబడియె. తద్వృత్తాంతం బంతయు నారదువలన విని సతీదేవి మహేశ్వరానుమతి వడసి దివ్యరథారూఢయై తండ్రికి బుద్ధి చెప్పుతలంపునఁ గైలాసంబున నుండి యేతెంచి. | 67 |
తే. | యజ్ఞదివాటంబు సొత్తెంచి యఖిలజనని | 68 |
వ. | అప్పుడు దక్షప్రజాపతి కోపించి వచ్చి కూఁతుచిత్తం బెఱింగి యి ట్లనియె. | 69 |
సీ. | హరుఁ డమంగళవేషుఁ డౌనొకాఁడో చెప్పు | |
- ↑ ‘వీరంద ఱెం తొప్పి’ అని వ్రా.ప్ర.