పుట:కాశీఖండము.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

442

శ్రీకాశీఖండము


దర్భహీనం బైనసంధ్యాదికృత్యంబును, జలహీనం బైనపైతృకంబును, హవిర్హీనం బైనహోమంబును, శివహీనం బైనక్రియాకలాపంబులు నిరర్థకంబులు.

65


తే.

అనినఁ గోపించి దక్షుఁ డీయవనిసురుని
వెడలఁ ద్రోయుఁడు ప్రాగ్వంశవేశ్మ మనినఁ
దనకుఁ దాన దధీచి యాస్థాన మెల్లఁ
దల్లడిల్లంగ వెడలె నుద్దామభంగి.

66


వ.

అతనితోడ దుర్వాసుండు, నుదంకుండు, నుపమన్యుండును, రుచికుండును, గాలవుండును, మాండవ్యుండును, వామదేవుండును, నుద్దాలకుండును వెడలిరి. అంతకమున్న మీఁ దెఱింగి బ్రహ్మ సత్యలోకంబునకుం జనియె. మఖంబు ప్రారంభింపబడియె. తద్వృత్తాంతం బంతయు నారదువలన విని సతీదేవి మహేశ్వరానుమతి వడసి దివ్యరథారూఢయై తండ్రికి బుద్ధి చెప్పుతలంపునఁ గైలాసంబున నుండి యేతెంచి.

67


తే.

యజ్ఞదివాటంబు సొత్తెంచి యఖిలజనని
యర్థిఁ గూర్చుండె రత్నసింహాసనమున
భక్తితో దేవసభయును బ్రహ్మసభయు
నంజలులు ఫాలభాగంబునందుఁ గూర్ప.

68


వ.

అప్పుడు దక్షప్రజాపతి కోపించి వచ్చి కూఁతుచిత్తం బెఱింగి యి ట్లనియె.

69


సీ.

హరుఁ డమంగళవేషుఁ డౌనొకాఁడో చెప్పు
        మెఱుఁగ కిచ్చితిమి నిన్నేమి చెప్ప?
నిటు చూడు [1]మిందఱు నిం తొప్పి యున్నవా

  1. ‘వీరంద ఱెం తొప్పి’ అని వ్రా.ప్ర.